Studio18 News - ANDHRA PRADESH / Tirupati : తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయం నందు స్థానిక శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి సమస్యలను పరిష్కరించారు. ప్రతి బుధవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఇకనుంచి శుక్రవారం జరుగుతుందని సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్నా 6 మండలాలలో ఎటువంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకుని రావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లడించారు. అనంతరం సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్న పార్టీ కార్యకర్తలతో కలసి నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Admin
Studio18 News