Sunday, 08 March 2026 10:00:39 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

cheating: పెళ్లికాని వారిని ట్రాప్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు

Date : 07 October 2024 03:27 PM Views : 452

Studio18 News - ANDHRA PRADESH / : Eluru district: పెళ్లికాని వారిని ట్రాప్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు లక్షల నగదు, బ్యాంకు పుస్తకాలు, కంప్యూటర్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మ్యాట్రిమోని డాట్.కామ్ లోని వివరాలను సేకరించి వీరు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఠా సభ్యులను ఏలూరు జిల్లా భీమడోలు పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ముఠా మోసాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి మండలం బంగారు పేటకు చెందిన పాశం అనిల్ ఇస్రోలో ఉద్యోగం అని, ఆస్తులు, బంగ్లాలు, విల్లాలు ఉన్నాయని మోసం చేసి నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఏలూరు జిల్లా భీమడోలుకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపారు. అనిల్ నాలుగు పెళ్లిళ్లు చేసుకొని మోసాలకు పాల్పడినట్లు గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. అనిల్ కు సహకరించిన మరో వ్యక్తిని అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. ముఠాలోని మరికొంత మంది సభ్యులను అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. సమాజంలో రకరకాల మోసాలకు మోసగాళ్లు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సూచించారు. పెళ్లిళ్లు విషయంలో ఎటువంటి విచారణ జరపకుండా మోసపోవద్దని, పెళ్లిళ్ల విషయంలో అవసరమైతే పోలీసు వెరిఫికేషన్ కూడా చేయించుకోండని ప్రజలకు ఎస్పీ సూచించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :