Monday, 17 March 2025 05:54:48 PM
# Seethakka: విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణ # Telangana Govt: తెలంగాణ శాస‌న‌స‌భ‌లో కీల‌క బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌భుత్వం # Revanth Reddy: అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం!: రేవంత్ రెడ్డి # Akbaruddin Owaisi: అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ # Court: నానిగారి కోసం 8 నెలలు వెయిట్ చేశాను: 'కోర్ట్' డైరెక్టర్ రామ్ జగదీశ్! # Chandrababu: అందులో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా: సీఎం చంద్రబాబు # Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్

జైలు నుంచి విడుదలైన పరిటాల రవి హత్య కేసు నిందితులు

2005 జనవరి 24న పరిటాల రవి దారుణ హత్య ఐదుగురు నిందితులకు నిన్న బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు 18 ఏళ్లుగా జైలు జీవితాన్ని గడుపుతున్న నిందితులు

Date : 20 December 2024 02:01 PM Views : 131

Studio18 News - ANDHRA PRADESH / : దివంగత నేత పరిటాల హత్య కేసులో దోషులు ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు. కేసులో నిందితులుగా ఉన్న నారాయణరెడ్డి (ఏ3), రేఖమయ్య (ఏ4), రంగనాయకులు (ఏ5), వడ్డే కొండ (ఏ6), ఓబిరెడ్డి (ఏ8)లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో వీరు రోజు జైలు నుంచి బయటకు వచ్చారు. వీరిలో నలుగురు కడప సెంట్రల్ జైలు, మరొకరు విశాఖ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. వీరంతా 18 ఏళ్లుగా జైలు జీవితాన్ని గడుపుతున్నారు. 2005 జనవరి 24న పరిటాల రవిని అనంతపురంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో దారుణంగా హతమార్చారు. మొద్దు శీను, రేఖమయ్య, నారాయణరెడ్డి కాల్పులు జరపగా... ఓబిరెడ్డి, రంగనాయకులు, వడ్డే కొండ తదితరులు టీడీపీ కార్యాలయం బయట బాంబులు వేసి అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. కాల్పుల్లో రవితో పాటు ఆయన గన్ మన్, ధర్మవరంకు చెందిన ఆయన అనుచరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో 16 మందిని నిందితులుగా చేర్చగా... నలుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. మిగిలిన 12 మందిలో రామ్మోహన్ రెడ్డి అప్రూవర్ గా మారాడు. ఏ1 మొద్దు శీను, ఏ2 మద్దెలచెరువు సూరితో పాటు తగరకుంట కొండారెడ్డి విచారణ సమయంలోనే హత్యకు గురయ్యారు. మర్డర్ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే సీబీఐ దర్యాప్తులో వీరిద్దరూ నిర్దోషులుగా తేలారు.

Also Read : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా ఇకలేరు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :