Saturday, 17 January 2026 10:25:46 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

జైలు నుంచి విడుదలైన పరిటాల రవి హత్య కేసు నిందితులు

2005 జనవరి 24న పరిటాల రవి దారుణ హత్య ఐదుగురు నిందితులకు నిన్న బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు 18 ఏళ్లుగా జైలు జీవితాన్ని గడుపుతున్న నిందితులు

Date : 20 December 2024 02:01 PM Views : 478

Studio18 News - ANDHRA PRADESH / : దివంగత నేత పరిటాల హత్య కేసులో దోషులు ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు. కేసులో నిందితులుగా ఉన్న నారాయణరెడ్డి (ఏ3), రేఖమయ్య (ఏ4), రంగనాయకులు (ఏ5), వడ్డే కొండ (ఏ6), ఓబిరెడ్డి (ఏ8)లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో వీరు రోజు జైలు నుంచి బయటకు వచ్చారు. వీరిలో నలుగురు కడప సెంట్రల్ జైలు, మరొకరు విశాఖ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. వీరంతా 18 ఏళ్లుగా జైలు జీవితాన్ని గడుపుతున్నారు. 2005 జనవరి 24న పరిటాల రవిని అనంతపురంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో దారుణంగా హతమార్చారు. మొద్దు శీను, రేఖమయ్య, నారాయణరెడ్డి కాల్పులు జరపగా... ఓబిరెడ్డి, రంగనాయకులు, వడ్డే కొండ తదితరులు టీడీపీ కార్యాలయం బయట బాంబులు వేసి అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. కాల్పుల్లో రవితో పాటు ఆయన గన్ మన్, ధర్మవరంకు చెందిన ఆయన అనుచరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో 16 మందిని నిందితులుగా చేర్చగా... నలుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. మిగిలిన 12 మందిలో రామ్మోహన్ రెడ్డి అప్రూవర్ గా మారాడు. ఏ1 మొద్దు శీను, ఏ2 మద్దెలచెరువు సూరితో పాటు తగరకుంట కొండారెడ్డి విచారణ సమయంలోనే హత్యకు గురయ్యారు. మర్డర్ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే సీబీఐ దర్యాప్తులో వీరిద్దరూ నిర్దోషులుగా తేలారు.

Also Read : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా ఇకలేరు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :