Tuesday, 31 March 2026 04:29:55 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Chandrababu Naidu: మైక్రో ఎంట్రప్రెన్యూర్లుగా వెనుకబడిన వర్గాలు... కార్యాచరణ సిద్ధం చేయాలన్న సీఎం చంద్రబాబు

Date : 04 February 2026 07:49 PM Views : 55

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : వెనుకబడిన వర్గాలను మైక్రో ఎంట్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశం ఆదరణ-3 ద్వారా కులవృత్తులకు ఆధునిక పరికరాల పంపిణీకి చర్యలు రూ.60 కోట్ల సాస్కీ నిధులతో బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం బీసీ హాస్టళ్లలో మార్చిలోగా ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం 6 జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ వెనుకబడిన వర్గాలను (బీసీ) కేవలం సంక్షేమ లబ్ధిదారులుగా పరిమితం చేయకుండా, వారిని సూక్ష్మ పారిశ్రామికవేత్తలుగా (మైక్రో ఎంట్రప్రెన్యూర్లు), ఎంఎస్ఎంఈలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కులవృత్తుల వారికి ఆధునిక సాంకేతికతను అందించే లక్ష్యంతో 'ఆదరణ-3' పథకం ద్వారా ఆధునిక పనిముట్లను పంపిణీ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. విద్యా రంగంలో బీసీ విద్యార్థులకు అత్యుత్తమ మౌలిక వసతులు కల్పించడంపై సమీక్షలో ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో రూ.60 కోట్ల సాస్కీ (SASKI) నిధులతో కొత్తగా బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఉన్న 814 బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు రూ.17 కోట్ల వ్యయంతో మార్చిలోగా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. హాస్టళ్లలో పారిశుధ్యం, విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని, అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యాబోధన వంటి అన్ని అంశాల్లోనూ ఉత్తమ పద్ధతులను (బెస్ట్ ప్రాక్టీసెస్) అనుసరించాలని సూచించారు. విద్యార్థుల విద్యాపరమైన పురోగతిని పర్యవేక్షించేందుకు వీలుగా అపార్ (APAR) ఐడీలను నమోదు చేసి, అనుసంధానం చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ దశలో ఉన్న బీసీ భవనాల పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే పేరుతో నడుస్తున్న 6 రెసిడెన్షియల్ పాఠశాలలను జూనియర్ కళాశాలల స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక బీసీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేసే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు. బీసీ స్టడీ సర్కిళ్లను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, వారికి ప్రయోజనం చేకూరేలా పథకాలు రూపొందించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :