Friday, 18 July 2025 06:55:35 AM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ఏమన్నారంటే..?

మహిళా శిశు సంక్షేమానికి 4 వేల కోట్ల నిధుల కేటాయించిన ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయిస్తామన్న మంత్రి పేదరికంతో రాష్ట్రంలో ఒక్క విద్యార్థ

Date : 11 November 2024 01:38 PM Views : 172

Studio18 News - ANDHRA PRADESH / : మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి సమాజ పురోగతిని కొలుస్తానన్న అంబేద్కర్ మాటలను అనుసరించి ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా సాధికారతపై దృష్టి సారించారని మంత్రి పయ్యావల కేశవ్ పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి, వివిధ శాఖల కేటాయింపులపై ప్రసంగించారు. రాష్ట్రంలో మహిళా సంక్షేమం, అభివృద్ధి, భద్రతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు ఈ ఏడాది బడ్జెట్ లో రూ.4,285 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయిస్తామని మంత్రి చెప్పారు. పేదరికం కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా త్వరలోనే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభిస్తామని మంత్రి వివరించారు. అదేవిధంగా, దీపం–2 పథకం ద్వారా గృహిణులకు ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని గుర్తుచేశారు. ఈ పథకం కింద ఇప్పటికే 5 లక్షల మంది గృహిణులు లబ్ది పొందుతున్నారని అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

Also Read : తెలుగు జాతిపై నోరు పారేసుకున్న సినీనటి కస్తూరి కోసం పోలీసుల గాలింపు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :