Thursday, 22 May 2025 02:57:14 PM
# చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ సంచలన ఆరోపణలు # రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక # నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్ # అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్ # 32 ఏళ్ల తర్వాత బాలకృష్ణ సినిమాలో విజయశాంతి? # పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు .. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా # సహనం కోల్పోయిన ట్రంప్.. నీకు తెలివి తక్కువ, గెటవుట్ అంటూ రిపోర్ట్‌పై చిందులు

Private Travels: దసరా ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్.. రెట్టింపు చార్జీల వసూలు

Date : 11 October 2024 12:13 PM Views : 97

Studio18 News - ANDHRA PRADESH / : దసరా పండుగ కోసం ఊరెళ్లాలనుకునే వారు ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ల దోపిడీకి గురవుతున్నారు. దసరా రద్దీని సొమ్ము చేసుకోవాలని భావిస్తున్న ట్రావెల్స్ చార్జీలను అడ్డగోలుగా పెంచేస్తూ ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నాయి. సీట్లు ఫుల్ అయిపోయాయని, కొన్ని సీట్లే ఉన్నాయని చెప్పి లేని కొరతను సృష్టిస్తూ అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయి. రైళ్లలో సీట్లు ఖాళీ లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను ఎంచుకుంటున్నారు. శనివారం దసరా కావడం, ఆదివారం సెలవు దినం కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు గురు, శుక్రవారాల్లోనే సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఏపీలో 1200 వరకు అద్దె బస్సులున్నాయి. రద్దీ నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో చార్జీలను ఏసీ బస్సుల్లో అయితే రూ. 1000, నాన్ ఏసీ బస్సుల్లో అయితే రూ. 700 వరకు అదనంగా వసూలు చేస్తున్నాయి. విజయవాడ నుంచి విశాఖపట్టణం వెళ్లాలనుకునే వారు చార్జీల మోతకు షాక్ అవుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ ఏకంగా రూ. 2 వేల నుంచి రూ. 2500 వరకు వసూలు చేస్తున్నాయి. విజయవాడ నుంచి కాకినాడకు రూ. 1500 నుంచి రూ. 2 వేలు వసూలు చేస్తున్నారు. అదే సమయంలో ఏపీఎస్ ఆర్టీసీ ఇంద్ర బస్సుల్లో విజయవాడ నుంచి వైజాగ్‌కు రూ 905, అమరావతి నుంచి అయితే రూ. 1,120 మాత్రమే వసూలు చేస్తుండగా, నాన్ ఏసీ బస్సుల్లో ఈ ధరలు రూ. 700 మాత్రమే. అయితే, సరిపడా ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడం, ఉన్నా ఒకటి రెండ్రు సీట్లు మాత్రమే ఉండడంతో కుటుంబంతో కలిసి ఊరెళ్లాలనుకునే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు, ఆదివారంతో దసరా సెలువులు ముగిసి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున తిరుగు ప్రయాణాలుంటాయి. అప్పుడు బస్సులకు మరింత డిమాండ్ ఉంటుంది. దీనిని కూడా సొమ్ము చేసుకోవాలని, రెండింతల చార్జీలను వసూలు చేయాలని ప్రైవేటు ట్రావెల్స్ ఇప్పటి నుంచే రెడీ అవుతున్నాయి. విశాఖ నుంచి విజయవాడ టికెట్ ధరలను కొన్ని ట్రావెల్స్ రూ. 3 వేలుగా చెబుతూ ఆన్‌లైన్‌లో పెట్టాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :