Thursday, 12 March 2026 12:44:18 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Chandrababu: తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చే డాక్టర్లకు ఇదే నా హెచ్చరిక: సీఎం చంద్రబాబు

Date : 20 September 2024 05:31 PM Views : 321

Studio18 News - ANDHRA PRADESH / : ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. అక్టోబరు నెల మొత్తం అర్హులైన పెన్షన్ దారుల నమోదు కోసం కేటాయిస్తామని తెలిపారు. దివ్యాంగులు... రూ.6 వేల పెన్షన్ కు అర్హులా? రూ.10 వేల పెన్షన్ కు అర్హులా? లేక వారు రూ.15 వేలు పెన్షన్ కు అర్హులా? అనేది పరిశీలించి, పెన్షన్లు ఇస్తామని వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్లకు చంద్రబాబు హెచ్చరికలు చేశారు. "వికలాంగులు కానివాళ్లకు కూడా సర్టిఫికెట్లు ఇస్తే, మీ ఉద్యోగాలకే ప్రమాదం వస్తుందని హెచ్చరిస్తున్నా. నేను పేదల పట్ల ఎంత ఉదారంగా ఉంటానో, తప్పులు చేసిన వాళ్ల పట్ల అంత కఠినంగా ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను" అని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. ఇవాళ తాను ఇక్కడికి వచ్చింది ప్రజలతో నేరు మాట్లాడాలన్న ఉద్దేశంతో అని చంద్రబాబు స్పష్టం చేశారు. సమస్యలను అర్థం చేసుకుని, పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో వచ్చానని వివరించారు. మద్దిరాలపాడు గ్రామంలో మూడు ఇళ్లకు వెళ్లానని చంద్రబాబు తెలిపారు. తమ 100 రోజుల పాలన పట్ల వారి అభిప్రాయాలు తెలుసుకున్నానని చెప్పారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నెలకు రూ.4 వేలు పెన్షన్ గా ఇస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్క ఇంటికీ లాభం కలగాలన్నది మా లక్ష్యం. పెన్షన్ ను రూ.4 వేలకు పెంచామని వివరించారు. ఎన్టీఆర్ రూ.35 తో పెన్షన్లకు శ్రీకారం చుట్టి, ఆ తర్వాత రూ.200 చేశారని... తాను ముఖ్యమంత్రి అయ్యాక ఐదేళ్లలో రూ.2 వేలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని వివరించారు. "ఇప్పుడు దాన్ని రూ.4 వేలు చేశాం. అందుకోసం ఏడాదికి రూ.35 వేల కోట్లు ఖర్చవుతుంది. ఏప్రిల్ నుంచే పెన్షన్ ఇస్తానని చెప్పాను... ఇచ్చిన మాట ప్రకారం తొలి నెలలో రూ.7 వేలు ఇచ్చాం. ఇటీవల 1వ తేదీ సెలవు వస్తే, ఉద్యోగులు బాధపడకుండా ఒకరోజు ముందే జీతం ఇచ్చాం. మా కూటమి ప్రజాప్రతినిధులు సహా, అధికారులందరూ పేదల ఇళ్లకు రావాలి, మీ కష్టాలు నేరుగా తెలుసుకోవాలి, మీ కష్టాలు చూసి మీతో అనుసంధానం కావాలని కోరుకున్నాం. మనం రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నాం... మన తర్వాత హర్యానాలో రూ.2,500 ఇస్తున్నారు. మనం ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తున్నాం" అని చంద్రబాబు వివరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :