Friday, 14 November 2025 03:11:18 PM
# Jubilee Hills Bypoll: రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్.. మధ్యాహ్నానికే ఫలితం.. 10 రౌండ్లలో లెక్కింపు # Nara Lokesh: మంత్రి లోకేశ్ చెప్పిన బిగ్ న్యూస్ ఇదే.. ఏపీకి రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి # Naresh: పెళ్లి సంబంధాలు కుదరట్లేదని మనస్తాపం.. యువకుడి బలవన్మరణం # Umar Mohammad: బాంబు దాడికి ముందు ఓల్డ్ ఢిల్లీ మసీదుకు వెళ్లిన ఉమర్.. 10 నిమిషాలు అక్కడే! # Nitish Kumar Reddy: నితీశ్ రెడ్డి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడడం లేదు... ఎందుకంటే...! # Kajol: పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి: కాజోల్ సంచలన వ్యాఖ్యలు # Sujal Ram Samudra: పెళ్లి వేదికపైనే వరుడిపై కత్తితో దాడి.. డ్రోన్‌ కెమెరాతో ఛేజింగ్! # Ambati Rambabu: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు # Amaravati: రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ # Diabetes in India: భారత్‌ను వణికిస్తున్న డయాబెటిస్.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గణాంకాలు # Google Doodle: ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా?.. ప్రత్యేకత ఇదే! # TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న ఏఐ చాట్‌బాట్‌! # Umar Un Nabi: ఎర్రకోట పేలుడు కేసులో టర్కీ లింక్.. 'ఉకాసా' కోడ్‌నేమ్‌తో హ్యాండ్లర్! # Kalvakuntla Kavitha: ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక: కాళోజీని కొనియాడిన కవిత # Marco Rubio: ఢిల్లీ పేలుడు దర్యాప్తు.. భారత ఏజెన్సీలపై అమెరికా ప్రశంసలు # Chandrababu Naidu: విశాఖలో పెట్టుబడుల జోష్.. సీఐఐ సదస్సుకు ముందే సీఎం చంద్రబాబు కీలక భేటీలు # China Bridge Collapse: చైనాలో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో ఇదిగో! # Bala Bharosa Scheme: తెలంగాణలో 'బాల భరోసా'.. చిన్నారుల కోసం సరికొత్త పథకం # Donald Trump: అమెరికాలో ముగిసిన సుదీర్ఘ షట్‌డౌన్.. ట్రంప్‌దే పైచేయి # Shardul Thakur: ముంబై ఇండియన్స్‌లోకి శార్దూల్.. పొరపాటున లీక్ చేసిన స్టార్ స్పిన్నర్

తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ సలహాదారు రాజీవ్‌కృష్ణ

రాజీవ్‌కృష్ణతో పాటు టీడీపీలో చేరిన పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన లోకేశ్ బూతులకు, అసభ్య పోస్టులకు వైసీపీ

Date : 14 November 2024 11:40 AM Views : 349

Studio18 News - ANDHRA PRADESH / : తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. కూటమి ప్రభుత్వ సమర్థ పాలనలో భాగస్వామ్యమయ్యేందుకు పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన ఎస్.రాజీవ్ కృష్ణ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. రెండు రోజుల క్రితం ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజీవ్ కృష్ణతో పాటు చాగల్లు జడ్పీటీసీ విజయదుర్గా శ్రీనివాస్, నిడదవోలు జడ్పీటీసీ కొయ్యా సూర్యారావు, కొవ్వూరు జడ్పీటీసీ బొంత వెంకటలక్ష్మి, ధర్మవరం ఎంపీటీసీ జొన్నకూటి కోమలి, తాళ్లపూడి ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు, తాళ్లపూడి సర్పంచ్ నక్కా చిట్టిబాబు, దొమ్మేరు సొసైటీ మాజీ అధ్యక్షుడు గారపాటి వెంకటకృష్ణ, ధర్మవరం సొసైటీ మాజీ అధ్యక్షుడు ముళ్లపూడి కాశీవిశ్వనాథ్, దాపర్తి శివప్రసాద్, మర్ని తారకరాము, వల్లూరి సత్యవరప్రసాద్, నీలం వీరభద్రరావు, ఉప్పులూరి రాజేంద్ర కుమార్, ఇమ్మని వీరశంకరం, బండి అశోక్, నల్లా రామ కిషోర్, పామెర్ల నగేశ్‌కుమార్, నామా సురేంద్ర, వేణుకుమార్ దొప్పలపూడి, ఎన్. దిలీప్ కుమార్, బొల్లిన సతీశ్, గారపాటి అభిరామ్ తదితర 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి లోకేశ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. బూతులకు, అసభ్యకర పోస్టులకు వైసీపీ ఒక మోడల్ అని ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ఆ పార్టీ 11 స్థానాలకు పడిపోయిందని విమర్శించారు. భాష ప్రధానమని, ప్రజలు మనపై పవిత్ర బాధ్యత పెట్టారని, అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రజాసమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా పనిచేస్తున్నామని చెప్పారు. నేనే రాజు, నేనే మంత్రి అని అనుకోకూడదని, టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని పేర్కొన్నారు. నేతలు స్థానికంగా అందరినీ సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. అందరం కలిసికట్టుగా రాష్ట్రాభివృద్ధికి కృషిచేద్దామని పిలుపునిచ్చారు. రాజీవ్ కృష్ణ భవిష్యత్‌ను తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి సముచిత గౌరవం కల్పిస్తామని, ప్రజల మెప్పు పొందాలని పేర్కొన్నారు. రాజీవ్ కృష్ణ మాట్లాడుతూ.. అందరినీ సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని చెప్పారు. పార్టీకి ఆస్తిగా మారతామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ వారికి అన్ని విధాల అండగా నిలుస్తామన్నారు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, పశ్చిమగోదావరి జడ్పీ మాజీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, కొత్తపల్లి లాల్, అల్లూరి విక్రమాదిత్య తదితరులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :