Studio18 News - TELANGANA / MANCHERIAL : మందమర్రి ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మందమర్రి మార్కెట్లో ఉగాది పచ్చడి మరియు బచ్చాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ మాట్లాడుతూ ప్రజలందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థించారు. ఉగాది పచ్చడిలోని ఏడు రుచులు జీవితంలోని కష్టసుఖాలను సూచిస్తాయని, వాటిని సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని పేర్కొన్నారు. అలాగే అందరూ కలిసికట్టుగా ఈ పండుగను జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవ్, మంచిర్యాల అధ్యక్షుడు నందిపాటి రాజ్కుమార్, సుందర్, జావిద్ పాషా, రాజు, కప్పల నవీన్, మాడి హర్షిత్, మామిడి అజయ్, పృధ్వి తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News