Friday, 14 February 2025 06:58:27 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Congress: మమ్మల్ని ఎలా బద్నాం చేయాలా? అని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారు: కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్

Date : 08 August 2024 02:38 PM Views : 56

Studio18 News - TELANGANA / : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు తప్పు పడుతున్నారని, తమను ఎలా బద్నాం చేయాలా? అనే ఆలోచనతోనే ముందుకు వెళుతున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ విదేశాల్లో పర్యటించి ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారో చెప్పాలని నిలదీశారు. తెలంగాణకు పెట్టుబడుల కోసం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తే బీఆర్ఎస్ నేతలు దానిని వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువ వడ్డీలకు ఇచ్చే ప్రపంచ బ్యాంకు వంటి వనరులను ఉపయోగించుకోలేదని, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు మాయమాటలు చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణలో పెట్టుబడులు తెచ్చేందుకు అందర్నీ ఆహ్వానిస్తున్నామన్నారు. గంజాయి, చీప్ లిక్కర్, డ్రగ్స్ మినహా అన్ని వ్యాపారాలకు అనుమతులు ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వడం, తెలంగాణ సంపదను పెంచడమే తమ లక్ష్యమన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :