Saturday, 14 March 2026 09:48:44 PM
# పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా # రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు # జిల్లాలో జనాభా గణన–2025 కోసం చర్యలు ప్రారంభం # పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం # పెద్దమ్మ తల్లి 27వ వార్షికోత్సవంలో ఘనంగా బోనాల ఉత్సవం # రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు, తోఫా పంపిణీ # కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ అమ్మమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి # సికింద్రాపూర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు # కేంద్ర నిధులతో అక్కాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన # రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి : సీపీఐ జిల్లా కార్యదర్శి భూక్యా రమేష్ # ధర్పల్లి మండలంలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం # రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి # జిల్లాకు వచ్చిన అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్‌ను కలిసిన కలెక్టర్

బెల్లంపల్లిలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

Date : 12 March 2026 06:26 PM Views : 51

Studio18 News - TELANGANA / MANCHERIAL : అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నిదానాలకంటే అన్నదానం గొప్పదని భావిస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గురువారం రోజున బెల్లంపల్లి కాంట చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ ప్రాంతంలో అమ్మ ఒడి ఎన్‌జీఓ అన్నదాత ప్రాజెక్ట్, టెక్నో డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. అన్నమో రామచంద్ర అని అలమటించే ఎందరో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు. గంప ఆరుణ–సత్యనారాయణ దంపతుల ఏకైక పుత్రిక స్నేహ వివాహం సాయిరాం తో మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు నడిచి ఏకమవుతున్న సందర్భంగా యాచకులు, నిరుపేదలు, దినసరి అడ్డ కూలీలు, బాటసారులకు సుమారు 200 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అమ్మ ఒడి అన్నదాత ప్రాజెక్ట్ వ్యవస్థాపకులు అజ్మీరా మోహన్, మంచిర్యాల జిల్లా బ్రాంచ్ మేనేజర్, టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమాండ్ల మధుకర్ మాట్లాడుతూ అమ్మ ఒడి అన్నదాత ప్రాజెక్ట్‌లో భాగంగా 370వ వారోత్సవ సందర్భంగా నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగిందన్నారు. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఒడి సభ్యులు హనుమాండ్ల సువర్ణ, గన్నేవరం తిరుమల చారి, బియ్యాల ఉపేందర్, భావాని, మేడిపల్లి రమేష్, ఎం.డి. యుసుఫ్, చెందుపట్ల లింగమూర్తి, కట్ట రాంకుమార్, కొలపూరి లక్ష్మణ్, అకుల మల్లేష్, ఖదీర్ పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :