Studio18 News - TELANGANA / NIRMAL : నిర్మల్ రూరల్ మండలం అక్కాపూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామంలో రూ.10 లక్షలతో ఎస్.హెచ్.జి (వీవో) భవన నిర్మాణానికి, రూ.10 లక్షలతో వర్కింగ్ షెడ్ నిర్మాణానికి, రూ.12 లక్షలతో ఎంయూపీపీఎస్ పాఠశాల కాంపౌండ్ నిర్మాణానికి మొత్తం రూ.32 లక్షలతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజేశ్వర్, నాయకులు రావుల రాంనాథ్, జమాల్, అనిల్, గంగాధర్, చిన్నయ్య, రమణ, గంగన్న, వెంకన్న, మల్లేష్, నరేందర్, సాయిరెడ్డి, శ్రీనివాస్తో పాటు మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News