Studio18 News - TELANGANA / RANGAREDDY : క్రాంతి జ్యోతి, భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా పూలే యువజన సంఘం ఆధ్వర్యంలో మన్సూరాబాద్ సహారా రోడ్డులో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. బి.ఎన్. రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ ప్రధాన అతిధిగా పాల్గొని సావిత్రి భాయి పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పిడికిలి రాజు, మేడిగ శ్రీధర్, శనిగరపు స్వామి, బొంగు వెంకటేష్ గౌడ్ తదితరులు కూడా నివాళులు అర్పించారు.
Admin
Studio18 News