Studio18 News - TELANGANA / MANCHERIAL : బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి హైదరాబాద్ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గం, అదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే మంత్రివర్యులతో చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన పలు ముఖ్యమైన అంశాలను మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్తూ వాటి పరిష్కారం కోసం సహకారం అందించాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే, బెల్లంపల్లి నియోజకవర్గంలో చేపట్టాల్సిన రోడ్లు, మౌలిక సదుపాయాలు మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తుందని మంత్రివర్యులు హామీ ఇచ్చారు.
Admin
Studio18 News