Saturday, 07 March 2026 08:23:22 PM
# పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు

కవిత బెయిల్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. 5 నెలల్లోనే బెయిల్‌ ఎలా వచ్చింది?

Date : 28 August 2024 05:58 PM Views : 613

Studio18 News - TELANGANA / : CM Revanth Reddy on Kavitha Bail: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై తీహార్ జైలు నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ”కవిత బెయిల్ కోసం ఎంపీ సీట్లు బీఆర్ఎస్ త్యాగం చేసింది నిజం బీఆర్ఎస్ – బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చింది. సిసోడియా, కేజ్రీవాల్‌కు రాని బెయిల్ 5 నెలల్లోనే కవితకు ఎలా వచ్చింది? మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో బీజేపీకి మెజారిటీ ఇచ్చింది నిజం కాదా? ఏడు చోట్ల డిపాజిట్ కోల్పోయి, 15 చోట్ల మూడవ స్థానం వచ్చేంత బలహీనంగా బీఆర్ఎస్ ఉందా?” అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న పనులకు చేరికలకు సంబంధం లేదని, ఎవరినో భయపెట్టి చేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని, ప్రభుత్వ విధానాలు నచ్చి వస్తే చేర్చుకుంటామని తెలిపారు. చెరువుల కబ్జాపై నిజనిర్ధారణ కమిటీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కమిటీకి హరీష్ రావు నేతృత్వం వహించినా ఫర్వాలేదన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ మాట్లాడాలనే కోరుకుంటున్నామని, ప్రభుత్వం ప్రతిపక్ష నేతగా జీతభత్యాలు తీసుకుంటున్నారు.. మరి పనిచేయాలిగా? అని ప్రశ్నించారు. ప్రజల ప్రయోజనం కోసమే హైడ్రా తెచ్చామని చెరువులో నిర్మాణాలు చేస్తే ఎంతటి వారైనా ఒకటే యుద్ధ ప్రాతిపాదికన కూల్చివేతలు పూర్తిచేస్తామన్నారు. లీడర్స్, హీరోలు ప్రజలకు రోల్ మోడల్ గా ఉండాలని సూచించారు. రుణమాఫీపై మాట్లాడుతూ.. ”కేసీఆర్ ప్రభుత్వం 2018-24 వరకు రుణమాఫీ చేసింది 13,329 కోట్లు. మా ప్రభుత్వం 27 రోజుల్లో 18 వేలకోట్లు రుణమాఫీ చేశాం. రైతును రుణవిముక్తి చేయడం మా లక్ష్యం.. టెక్నికల్ అంశాలతో రుణమాఫీ జరగని వారు కలెక్టర్ కు వివరాలు ఇవ్వండి. రుణమాఫీ కానీ వారి వివరాలు కేటిఆర్, హరీశ్ కూడా ఇవ్వొచ్చు.. వారి వివరాలు ఇచ్చి పాపాలు కడుక్కోండి. అక్రమ కట్టడాల కూల్చివేతపై కేసీఆర్ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో తెలుసు. గతంలో స్వార్థం కోసం.. నిర్మాణాల కూల్చివేత జరిగింది.. ఆగింది. కానీ నేను రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ను కాను.. ఆయనతో పోలికే ఉండద” ని సీఎం రేవంత్ అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :