Thursday, 12 March 2026 03:43:59 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Etela Rajender: కోర్టులో చెల్లదని తెలిసినా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించారు: ఈటల రాజేందర్

Date : 30 September 2025 07:14 PM Views : 315

Studio18 News - TELANGANA / HYDERABAD : ఎవరిని మోసం చేయడానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని ప్రశ్న బీహార్, మహారాష్ట్రలలో రిజర్వేషన్లపై నమోదైన కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసిందని వెల్లడి కోర్టుకు వెళ్లవద్దని మంత్రులు చెబుతున్నారు.. వెళితే అభ్యంతరమేమిటని ప్రశ్న కోర్టులో చెల్లవని తెలిసినా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించి గందరగోళానికి గురి చేస్తున్నారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. ఎవరిని మోసం చేయడానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని ఆయన ప్రశ్నించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్‌లోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ, బీహార్, మహారాష్ట్రలలో రిజర్వేషన్లపై నమోదైన పలు కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసిందని అన్నారు. ఎవరూ కోర్టుకు వెళ్లవద్దని ముగ్గురు మంత్రులు చెబుతున్నారని, కోర్టుకు వెళితే అభ్యంతరం ఏమిటని ప్రశ్నిస్తున్నానని ఈటల అన్నారు. ఎన్నికల్లో ఓటు కోసం డబ్బులు ఖర్చు పెట్టవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెబుతోందని అన్నారు. నల్గొండ జిల్లాలోని గిరిజన తండాల్లో బీసీలు లేకున్నా రిజర్వేషన్ ప్రకటించారని విమర్శించారు. తమ పార్టీ తరఫున శాసనసభలో, మండలిలో పూర్తిగా మద్దతు ఇచ్చామని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో బీజేపీని అనవద్దని సూచించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :