Studio18 News - TELANGANA / RANGAREDDY : మన్సూరాబాద్–గౌరెల్లి పాత పోచంపల్లి జెడ్పి రోడ్ను పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి దేవాదాయ ధర్మాదాయ, అటవీ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆటో నగర్ జాతీయ హరిత వనస్థలి పార్క్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు డంపింగ్ యార్డ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆటో నగర్ డంపింగ్ యార్డ్ను తొలగించి ప్రజలకు సత్వరమే ఉపశమనం కల్పించాలని కోరారు. అలాగే అధికారులతో మాట్లాడి మన్సూరాబాద్–గౌరెల్లి పాత పోచంపల్లి జెడ్పి రోడ్ నిర్మాణ పనులకు అవసరమైన అనుమతులు మంజూరు చేసి పనులు త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కర్మన్ ఘాట్ ఆంజనేయ టెంపుల్ డైరెక్టర్ జనంపల్లి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News