Monday, 17 March 2025 04:33:55 PM
# DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ # Baidu: ఏఐ రేసు రసవత్తరం... రెండు కొత్త మోడళ్లను తీసుకువచ్చిన చైనా సంస్థ # Sudeekshs Konanki: డొమినికన్ రిపబ్లిక్ లో భారత సంతతి విద్యార్థిని అదృశ్యం... బీచ్ లో లభ్యమైన దుస్తులు # Bhumana Karunakar Reddy: పవనానందుల గొంతుక ఇప్పుడెందుకు మూగబోయింది?: భూమన # Sunita Williams: 9 నెలల తర్వాత సునీతా విలియమ్స్ ముఖంలో ఆనందం... మాటల్లో వర్ణించలేం! # Youtuber Harsha Sai: బెట్టింగ్ యాప్స్ వ్యవహారం... యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు # Chandrababu: పదో తరగతి పరీక్షలు రాస్తున్న నా యువ నేస్తాలకు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు # DK Aruna: నిన్న రాత్రి మా ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు: డీకే అరుణ # Revanth Reddy: ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు: సీఎం రేవంత్ రెడ్డి # L2E: Empuraan: మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మోహన్ లాల్ ఎల్2ఈ: ఎంపురాన్

మోదీ, అదానీ కలిసి దేశ పరువు తీశారు: రేవంత్ రెడ్డి

అదానీ అవినీతిపై మోదీ ఎందుకు మాట్లాడటం లేదన్న రేవంత్ అదానీపై విచారణ జరిపించాలని డిమాండ్ భారత వ్యాపార సంస్థలు అవినీతిలో కూరుకుపోయాయని విమర్శ

Date : 18 December 2024 03:22 PM Views : 93

Studio18 News - TELANGANA / : ప్రధాని మోదీ, బీజేపీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 75 ఏళ్లుగా దేశ ప్రతిష్ఠను కాంగ్రెస్ పార్టీ పెంపొందించిందని... మోదీ, అదానీ కలిసి దేశ పరువు తీసేశారని విమర్శించారు. అదానీ అవినీతిని మోదీ ఎందుకు ప్రశ్నించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అదానీపై వచ్చిన ఆరోపణలు, మణిపూర్ అల్లర్ల అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా రాజ్ భవన్ సమీపంలో సీఎం భైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ పరువు మంటకలిపిన అదానీపై విచారణ జరపాలని రేవంత్ డిమాండ్ చేశారు. భారత వ్యాపార సంస్థలు అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించారు. అదానీ సంస్థలు అమెరికాలో లంచాలు ఇవ్వజూపాయని... చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎఫ్బీఐ నివేదించడంతో అమెరికా ప్రభుత్వం చర్యలకు పూనుకుందని చెప్పారు. అదానీ అవినీతిపై చర్చించేందుకు, జేపీసీ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని... అలా చేస్తే అదానీ జైలుకు వెళ్లడం ఖాయమని రేవంత్ అన్నారు. అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీకి బీఆర్ఎస్ నేతలు లొంగిపోయారని... అందుకే అదానీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని విమర్శించారు. అదానీ అవినీతిపై జేపీసీ కోసం లోక్ సభలో ఏకగ్రీవ తీర్మానం చేద్దామని అన్నారు.

Also Read : తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :