Monday, 17 February 2025 04:46:31 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

రూ.100 కోట్లు ఇవ్వొద్దని అదానీకి లేఖ రాశాం.. ఇక తెలంగాణను వివాదాల్లోకి లాగకండి: సీఎం రేవంత్ రెడ్డి

విమర్శల దృష్ట్యా రూ.100 కోట్ల విరాళం తిరస్కరిస్తున్నామన్న సీఎం ఏ సంస్థకైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునే హక్కు ఉందన్న సీఎం స్పీకర్ కుమార్తె పెళ్ల

Date : 25 November 2024 04:05 PM Views : 88

Studio18 News - TELANGANA / : స్కిల్ యూనివర్సిటీకి ఇస్తామన్న రూ.100 కోట్లు ప్రభుత్వ ఖాతాలో వేయకండని తాము అదానీకి లేఖ రాశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అమెరికాలో కేసు తదితర పరిణామాల నేపథ్యంలో అదానీ నుంచి రూ.100 కోట్లు స్వీకరించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అనవసర వివాదాల్లోకి తెలంగాణను లాగవద్దని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. విమర్శల దృష్ట్యా ఈ విరాళం తిరస్కరించినట్లు వెల్లడించారు. అదానీ విషయమై కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చ సాగుతోందన్నారు. అమెరికాలో కేసు నమోదు కావడంతో ఈ చర్చ సాగుతోందన్నారు. అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం కూడా నిధులు సేకరించిందని ప్రచారం చేస్తున్నారని, కానీ ప్రభుత్వ ఖాతాలోకి ఎవరి నుంచి డబ్బులు రాలేదన్నారు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు వస్తున్నట్లు చెప్పారు. నిబంధనల మేరకు తమ ప్రభుత్వం టెండర్లను పిలిచి ప్రాజెక్టులు ఇస్తోందని వెల్లడించారు. దేశంలోని ఏ సంస్థకైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునే హక్కు ఉందన్నారు. అంబానీ, అదానీ, టాటా.. ఇలా ఎవరికైనా తెలంగాణలోనూ వ్యాపారం చేసుకునే హక్కు ఉంటుందన్నారు. సీఎస్ఆర్ కింద మాత్రమే అదానీ గ్రూప్ స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు ఇచ్చిందని స్పష్టం చేశారు. కానీ ఈ రూ.100 కోట్లను సీఎం, మంత్రులకు ఇచ్చినట్లుగా ప్రచారం చేయడం విడ్డూరమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అదానీ ఇస్తామన్న రూ.100 కోట్లను స్వీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు లేఖ రాసినట్లు చెప్పారు. స్పీకర్ కుమార్తె పెళ్లి కోసం ఢిల్లీకి వచ్చానన్న సీఎం లోక్ సభ స్పీకర్ కుమార్తె వివాహం కోసం తాను ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుత తన ఢిల్లీ పర్యటనకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు. పార్లమెంట్ సమావేశాలపై రేపు ఎంపీలతో చర్చిస్తామన్నారు. అందుబాటులో ఉన్న మంత్రులతో కలిసి రేపు రాష్ట్ర సమస్యలను కేంద్రానికి వివరిస్తామన్నారు. కొంతమంది తాను 28సార్లు ఢిల్లీకి వచ్చినట్లు చెబుతున్నారని, కానీ వారిలో పైరవీలు చేయడానికో... బెయిల్ కోసమో తాను ఢిల్లీకి రావడం లేదన్నారు. కేంద్రాన్ని కలిసి మనకు రావాల్సినవి రాబట్టుకోవడం కోసం వస్తున్నామన్నారు. అవసరమనుకుంటే ఢిల్లీకి ఎన్నిసార్లైనా వస్తానన్నారు.

Also Read : డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌కు నివేదిక అందించిన కవిత

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :