Sunday, 16 March 2025 02:46:32 PM
# Omar Abdullah: జమ్మూకశ్మీర్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ఒమర్ అబ్దుల్లా # AP Govt: ఏపీ స‌ర్కార్ ఆసక్తికర నిర్ణ‌యం... ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు అవార్డులు! # Pawan Kalyan: ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి # Chegondi Harirama Jogaiah: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు హరిరామజోగయ్య బహిరంగ లేఖ # Nara Lokesh: ఆల్ఫా హోటల్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి టీ తాగిన నారా లోకేశ్ # Donald Trump: ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం... పాక్ స‌హా 41 దేశాల‌పై ట్రావెల్ బ్యాన్‌...? # Pawan Kalyan: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై డీఎంకే స్పందన # Revanth Reddy: చంద్రశేఖర్ రావ్... నీ పిల్లలకు చెప్పు... మాట జారితే ఫలితం అనుభవిస్తారు: సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ # దేశంలో కులగణన చేయాలని ఎన్డీయే ప్రభుత్వానికి డిమాండ్ కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్న మాయావతి సమగ్ర అభివృద్ధి కోసం జనగణన అవసరమని వ్యాఖ్య # Sovereign Bonds: వారి పంట పండింది... రూ.1 లక్షకు రూ.3 లక్షలు ఇవ్వనున్న ఆర్బీఐ # మ‌రో వారం రోజుల్లో ఐపీఎల్ 18వ సీజ‌న్ ప్రారంభం మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న‌ ఐపీఎల్ 2025 2008లో ప్రారంభ‌మైన క్యాష్ రిచ్ లీగ్ కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా # త్రిభాషా విధానం కొత్తదేమీ కాదన్న కిషన్ రెడ్డి హిందీని బలవంతంగా రుద్దుతున్నారని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆవేదన పునర్విభజనతో సీట్లు తగ్గవన్న కిషన్ # విమానం మిస్ అయితే రూ.7,500 వరకు పరిహారం రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో ఉబర్ ఒప్పందం ముంబై ప్రయాణికుల కోసం ప్రత్యేక పథకం # కేసీఆర్ ను మార్చురీకి పంపిస్తామని రేవంత్ అన్నారన్న హరీశ్ రావు తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం దారుణమని వ్యాఖ్య చంద్రబాబుని # వారంలో ఐదు రోజుల పని దినాలతో పాటు వివిధ డిమాండ్లపై ఐబీఏతో చర్చలు చర్చలు సఫలం కాలేదని యూఎఫ్‌బీయూ వెల్లడి సమ్మెకు పిలుపునిచ్చిన తొమ్మిది బ్యాంకు ఉద్యోగ # Supritha: క్షమాపణ చెప్పిన సురేఖావాణి కూతురు సుప్రీత... కారణం ఇదే! # Pochampalli Srinivas Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీని నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు # Daggubati Purandeswari: పవన్ కల్యాణ్ కు పురందేశ్వరి శుభాకాంక్షలు # Bank: ఈ నెల 24, 25 తేదీల్లో బ్యాంకర్ల దేశవ్యాప్త సమ్మె: యూఎఫ్‌బీయూ # Chiranjeevi: తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన నా తమ్ముడు నాగేంద్రబాబుకు అభినందనలు: చిరంజీవి

అప్రమత్తంగా ఉండండి.. హైదరాబాద్ యువతకు, వారి తల్లిదండ్రులకు సీపీ శ్రీనివాస్ రెడ్డి కీలక సూచన..

Date : 26 August 2024 03:10 PM Views : 96

Studio18 News - TELANGANA / : Hyderabad CP Kota Kota Srinivasa Reddy : హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. బోయినపల్లిలో రూ.8.5 కోట్ల విలువ చేసే ఎనిమిదిన్నర కిలోల మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో పెద్ద మొత్తంలో తరలిస్తున్న ఎంఫిటమిన్ డ్రగ్స్ ను పట్టుకున్నాం. ఈ డ్రగ్స్ ను ఇంజక్షన్లు, లిక్విడ్ గాను.. వివిధ రూపాల్లో తీసుకుంటున్నారు. ఈ డ్రగ్ ను అమ్మాయిలకు కూల్ డ్రింక్స్ లో కలిపి ఇస్తున్నారని సీపీ అన్నారు. 8.5 కేజీల ఎంఫిటమిన్ డ్రగ్ ముడి సరుకును సీజ్ చేయడం చేయడం జరిగింది. ఈ డ్రగ్స్ రవాణాలో ప్రధాన నిందితుడు సంగారెడ్డి కంచెర్ల నాగరాజు అని సీపీ తెలిపారు. కుంతి శ్రీ శైలం, వినోద్ కుమార్ లతో కలిసి నాగరాజు ఈ డ్రగ్స్ రవాణా చేస్తున్నాడు. గతంలో గుమ్మిడిదలలో ఆల్ఫాజోలంను తయారు చేస్తున్న అంజిరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని కంపెనీ సీజ్ చేశాం. అరెస్ట్ అయిన పాత నేరస్తుడు అంజిరెడ్డి శిష్యుడు కంచెర్ల నాగరాజు. అంజిరెడ్డి అరెస్ట్ కు ముందు డ్రగ్ ముడి సరుకును నాగరాజు దగ్గర పెట్టి వ్యాపారానికి ప్లాన్ చేశాడని సీపీ తెలిపారు. మార్కెట్లో ఈ డ్రగ్ ఖరీదు ఒక కేజీ రూ. కోటి నుంచి కోటిన్నర వరకు ఉంటుంది. ఈ ఎంఫిటమిన్ డ్రగ్స్ సమాచారం పై హెచ్ న్యూ దృష్టి సారించింది. బోయినపల్లి పల్లిలో స్థానిక పోలీసులు, హెచ్ న్యూ టీమ్స్ 8.5 కేజీల ఎంఫిటమిన్ డ్రగ్ పట్టుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులను పట్టుకుని అరెస్ట్ చేశాం. పరారీ లో ఉన్న ఇతర వ్యక్తులను పట్టుకునేందుకు టీమ్స్ గాలిస్తున్నాయని సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ 8.5 కేజీల డ్రగ్స్ ఖరీదు మొత్తం రూ.8.5 కోట్ల విలువ ఉంటుందని తెలిపారు. సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి యువతకు కీలక సూచన చేశారు.. దయచేసి నగర యువత డ్రగ్స్ బారిన పడకండి. పార్టీలకు వెళ్లే యువత.. తెలిసిన, తెలియని వ్యక్తులతో వెళ్ళినపుడు అప్రమత్తంగా ఉండాలి. మాదక ద్రవ్యాలను కూల్ డ్రింక్స్ లో కలిపి ఇస్తుంటారు. కాబట్టి అలెర్ట్ గా ఉండాలి. తల్లి దండ్రులుసైతం తమ పిల్లలు ఎవరితో పార్టీలకు పోతున్నారో గమనిస్తూ ఉండాలని సీపీ సూచించారు. డ్రగ్స్ ను వాడడంతో పాటు పక్కవారికి అలవాటు చేసిన వారిపైకూడా కేసులు పెడుతాం. ఇక నుండి కన్జ్యుమర్లు పై ఉక్కుపాదం మోపుతామని సీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :