Thursday, 22 May 2025 03:13:11 PM
# చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ సంచలన ఆరోపణలు # రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక # నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్ # అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్ # 32 ఏళ్ల తర్వాత బాలకృష్ణ సినిమాలో విజయశాంతి? # పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు .. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా # సహనం కోల్పోయిన ట్రంప్.. నీకు తెలివి తక్కువ, గెటవుట్ అంటూ రిపోర్ట్‌పై చిందులు

K Kavitha Bail: ఫోన్‌లోని మెసేజ్‌లు డిలీట్ చేయడం నేరం కాదు.. కవితకు బెయిలు మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Date : 28 August 2024 12:39 PM Views : 112

Studio18 News - TELANGANA / : ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిలు మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె తన మొబైల్ ఫోన్‌లోని మెసేజ్‌లను డిలీట్ చేయడం నేరం కాబోదని జస్టిస్ బీఆర్ గవి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. కవిత పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై వాదనలు సందర్భంగా సీబీఐ, ఈడీ తరపున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు పలు ఆరోపణలు చేశారు. కవిత తన మొబైల్ ఫోన్లలోని మెసేజ్‌లను డిలీట్ చేయడంతోపాటు వాటిని ఆమె ఫార్మాట్ చేసి సాక్ష్యాలను చెరిపివేశారని ఆరోపించారు. స్పందించిన ధర్మాసనం ఫోన్‌లోని మెసేజ్‌లను ఎప్పటికప్పుడు చెరిపివేస్తూ ఉంటారని, దీనిని బలపరిచే ఇతర సాక్ష్యాలు లేనట్టయితే ఇది నేరపూరిత చర్య కాబోదని తేల్చి చెప్పింది. దర్యాప్తు సంస్థల వాదనను కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజలు ఇప్పుడు తమ ఫోన్లను ఆటవస్తువుల్లా ఉపయోగిస్తున్నారని, ఫోన్‌ను అప్‌డేట్ చేసేందుకే తన క్లయింట్ ఫార్మాట్ చేశారని కోర్టుకు తెలిపారు. ఆయన వాదనతో అంగీకరించిన సుప్రీం ధర్మాసనం మెసేజ్‌లను డిలీట్ చేయడం, ఫార్మాట్ చేయడం నేరం కాబోదని పేర్కొంది. ఫోన్ అనేది ప్రైవేటు విషయమని, అందులో ఇతర విషయాలు కూడా ఉంటాయని జస్టిస్ విశ్వనాథన్ తెలిపారు. గ్రూపుల నుంచి వచ్చే మెసేజ్‌లతో ఫోన్ నిండిపోతుందని, కాబట్టి వచ్చిన మెసేజ్‌లను వచ్చినట్టు డిలీట్ చేయడం తనకు అలవాటని వివరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :