Studio18 News - TELANGANA / RAJANNA SIRCILLA : వారు ఒకరికి ఒకరు రాజకీయ విరోధులు అయినా ప్రజా సమస్యపై స్పందించి ఒకరికి ఒకరు కలిసి కరచలనం చేసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. రాజకీయంగా వేరు వేరు వర్గాలుగా ఉన్నప్పటికి కేటీఆర్, బండి సంజయ్ ఒకరినొకరు కరచాలనం చేసుకొన్న చిత్రమైన సంఘటన గంభీరావుపేట మండలం నర్మల ఎగువ మానేరు జలాశయం వద్ద చోటుచేసుకుంది.. జలాశయం వద్ద చిక్కుకున్న పశువుల కాపరులను కాపాడిన అనంతరం పరామర్శించడానికి వచ్చిన ఇద్దరు కరచాలనం చేసుకుని ఒకరినొకరు బాగోగులు అడిగి తెలుసుకున్నారు. దీంతో అక్కడే ఉన్న ఇరుపార్టీల నాయకులు కార్యకర్తలు వారినాయకుల పేర్లతో జైఅంటూ నినాదాలు చేశారు.. జలాశయంను, బాధితులను పరామర్శించిన అనంతరం.. కేటీఆర్ మీడియాతో మాట్లాడారు ఒకవైపు రాష్ట్రం వరదల్లో చిక్కుకుంటే ప్రభుత్వం మూసి నది సుందరీకరణకోసం, ఒలంపిక్స్ ను రాష్ట్రానికి ఎలా తేవాలనే విధంగా ఆలోచిస్తుందని, రోమ్ నగరం తగలబడి పోతుంటే ఆ దేశ చక్రవర్తి పిడేలు వాయించుకుని కూర్చున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం వరదల్లో చిక్కుకుంటే ఎటువంటి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలో కనీస అవగాహన ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా పంటనష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 నష్టపరిహారంతో పాటు ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు 25లక్షల రూపాయలను వెంటనే ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బాధితులను కాపాడిన అధికారులందరికి అభినందనలు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read : #Rajannasircilla : ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన ఏడుగురు క్షేమం
Admin
Studio18 News