Studio18 News - TELANGANA / HYDERABAD : హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. దర్యాప్తు సంస్థలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జీషీటులో బ్యాగ్ మ్యాన్(రేవంత్ రెడ్డి) పేరును ఈడీ చేర్చింది. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తామని ప్రలోభపెట్టారని అందులో పేర్కొంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ సారైనా రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకుంటుందా..? లేదా అమృత్ పథకం వంటి స్కామ్ల తరహాలో వదిలి పెడుతారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న అంతర్గత కుమ్ములాటలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కకావికలమైంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
Admin
Studio18 News