Tuesday, 10 March 2026 04:09:21 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికలకు హెచ్‌పీవీ టీకాల పంపిణీ

Date : 09 March 2026 07:25 PM Views : 106

Studio18 News - TELANGANA / NIZAMABAD : ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో 14 సంవత్సరాలు నిండిన బాలికలందరికీ సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం హెచ్‌పీవీ టీకాలు అందిస్తున్నామని ధర్పల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుశాంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం ఐదుగురు బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. హెచ్‌పీవీ అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అని, ఇది పునరుత్పత్తి మార్గంలో కలిగే సాధారణ సంక్రమణగా గుర్తించబడిందని వివరించారు. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌కు ప్రధాన కారణం ఈ హెచ్‌పీవీ వైరస్ అని చెప్పారు. ఇది కొత్త వ్యాక్సిన్ కాదని, 2006 సంవత్సరం నుంచే ఈ టీకాను అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే హెచ్‌పీవీ వ్యాక్సిన్ గార్డసిల్–4 చాలా ఖరీదైనదిగా, సుమారు ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయల విలువ ఉంటుందని, అయితే ప్రభుత్వం అర్హులైన 14 సంవత్సరాల బాలికలకు దీనిని ఉచితంగా అందిస్తోందని చెప్పారు. సంతానం కలగదని, గర్భస్రావాలు అవుతాయని, పుట్టుకలో లోపాలు వస్తాయని వంటి అపోహలకు ప్రజలు గురికావద్దని, ఇది పూర్తిగా సురక్షితమైన టీకా అని స్పష్టం చేశారు. 2011 మార్చి 7 నుంచి 2012 మార్చి 8 మధ్య జన్మించిన 14 సంవత్సరాల బాలికలందరికీ ఈ టీకాను ఇవ్వించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుశాంత్ రెడ్డి, సూపర్వైజర్ భూలక్ష్మి, ఓపీ ఏఎన్ఎం మీనా, సుమలత, శ్రీనివాస్, పద్మ, మురళి తదితరులు పాల్గొన్నారు. రూరల్ ప్రసాద్.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :