Friday, 14 November 2025 02:07:13 PM
# Jubilee Hills Bypoll: రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్.. మధ్యాహ్నానికే ఫలితం.. 10 రౌండ్లలో లెక్కింపు # Nara Lokesh: మంత్రి లోకేశ్ చెప్పిన బిగ్ న్యూస్ ఇదే.. ఏపీకి రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి # Naresh: పెళ్లి సంబంధాలు కుదరట్లేదని మనస్తాపం.. యువకుడి బలవన్మరణం # Umar Mohammad: బాంబు దాడికి ముందు ఓల్డ్ ఢిల్లీ మసీదుకు వెళ్లిన ఉమర్.. 10 నిమిషాలు అక్కడే! # Nitish Kumar Reddy: నితీశ్ రెడ్డి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడడం లేదు... ఎందుకంటే...! # Kajol: పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి: కాజోల్ సంచలన వ్యాఖ్యలు # Sujal Ram Samudra: పెళ్లి వేదికపైనే వరుడిపై కత్తితో దాడి.. డ్రోన్‌ కెమెరాతో ఛేజింగ్! # Ambati Rambabu: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు # Amaravati: రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ # Diabetes in India: భారత్‌ను వణికిస్తున్న డయాబెటిస్.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గణాంకాలు # Google Doodle: ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా?.. ప్రత్యేకత ఇదే! # TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న ఏఐ చాట్‌బాట్‌! # Umar Un Nabi: ఎర్రకోట పేలుడు కేసులో టర్కీ లింక్.. 'ఉకాసా' కోడ్‌నేమ్‌తో హ్యాండ్లర్! # Kalvakuntla Kavitha: ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక: కాళోజీని కొనియాడిన కవిత # Marco Rubio: ఢిల్లీ పేలుడు దర్యాప్తు.. భారత ఏజెన్సీలపై అమెరికా ప్రశంసలు # Chandrababu Naidu: విశాఖలో పెట్టుబడుల జోష్.. సీఐఐ సదస్సుకు ముందే సీఎం చంద్రబాబు కీలక భేటీలు # China Bridge Collapse: చైనాలో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో ఇదిగో! # Bala Bharosa Scheme: తెలంగాణలో 'బాల భరోసా'.. చిన్నారుల కోసం సరికొత్త పథకం # Donald Trump: అమెరికాలో ముగిసిన సుదీర్ఘ షట్‌డౌన్.. ట్రంప్‌దే పైచేయి # Shardul Thakur: ముంబై ఇండియన్స్‌లోకి శార్దూల్.. పొరపాటున లీక్ చేసిన స్టార్ స్పిన్నర్

Jishnu Dev Varma: త్రిపుర నుంచి గవర్నర్ గా వెళుతున్న తొలి వ్యక్తిని నేనే: తెలంగాణ కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

Date : 30 July 2024 03:58 PM Views : 296

Studio18 News - TELANGANA / : తనకు ప్రధాని నరేంద్రమోదీ నుంచి, ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని, దీంతో తాను తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు తెలిసిందని రాష్ట్ర నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. ఆయన త్రిపుర మాజీ ఉపముఖ్యమంత్రిగా పని చేశారు. రాష్ట్ర గవర్నర్‌గా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అగర్తాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... త్రిపుర నుంచి ఓ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులైన తొలి వ్యక్తిని తానే నన్నారు. తనకు శనివారం రాత్రి ప్రధాని మోదీ ఫోన్ చేశారని తెలిపారు. ఆయన ఫోన్ చేసే వరకు తన నియామకం గురించి తెలియదన్నారు. 'మీరు త్రిపుర వెలుపల పని చేయాల్సి ఉంటుంది' అని తనకు ఫోన్ చేసి ప్రధాని చెప్పారని వెల్లడించారు. ఎలాంటి బాధ్యతలు అప్పగించినా సిద్ధమేనని తాను మోదీకి తెలిపానన్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, ఆయన స్వాగతం పలుకుతూ ఫోన్ చేశారని తెలిపారు. దీంతో తాను తెలంగాణకు గవర్నర్‌గా వెళుతున్నట్లుగా అర్థమైందన్నారు. గతంలో తాను త్రిపుర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించానని, ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన విధులను నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ సీఎంతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహిస్తానన్నారు. త్రిపురపై ప్రధాని మోదీకి శ్రద్ధ ఉందని, ఇందుకు తన నియామకమే నిదర్శనమన్నారు. తాను త్రిపుర ఉపముఖ్యమంత్రిగా, మంత్రిగా పని చేసినప్పుడు మోదీ సహకారం అందించారన్నారు. ఈ నెల 31న తెలంగాణకు వెళ్లి అదే రోజున ప్రమాణ స్వీకారం చేస్తానని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :