Saturday, 07 March 2026 08:42:12 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

హైడ్రా సంచలన నిర్ణయం..! ఆ అధికారుల గుండెల్లో రైళ్లు..!

Date : 30 August 2024 10:54 AM Views : 676

Studio18 News - TELANGANA / : Hydra : హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ కోసం ఏర్పడిన హైడ్రా.. తగ్గేదేలే అన్న రీతిలో దూకుసుపోతోంది. చెరువుల్లో వెలసిన అక్రమ కట్టడాలను కూల్చేస్తూ కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. చెరువులను కబ్జా చేసి కట్టిన కట్టడాలను నేలమట్టం చేస్తూ ముందుకు సాగుతోంది. ఇక, తాజాగా హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారుల భరతం పట్టనుంది. వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆరుగురు ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులకు అంతా రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. వారిపై కేసులు పెట్టాలని ఇప్పటికే సైబరాబాద్ కమిషనర్ కు హైడ్రా సిఫార్సు చేసింది. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని ఓ డిప్యూటీ కమిషనర్ పై కేసు నమోదు చేయాలని హైడ్రా సిఫార్సు చేసింది. హెచ్ఎండీఏ అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ అధికారిపై కేసు పెట్టాలని సిఫార్సు చేసింది. నిజాంపేట మున్సిపల్ కమిషనర్, బాచుపల్లి తహశీల్దార్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లపై కేసు నమోదు చేయాలని సూచించింది. ఇప్పటికే గండిపేట సూపరింటెండెంట్ ఇంజినీర్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హైడ్రా సిఫార్సు చేసింది. అంతేకాదు త్వరలో ఇతర ప్రాంతాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :