Friday, 18 July 2025 05:45:19 AM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

Seethakka: కేంద్ర బడ్జెట్‌పై స్పందించని కేసీఆర్... రాష్ట్ర బడ్జెట్‌పై మాట్లాడటం విడ్డూరం: మంత్రి సీతక్క

Date : 25 July 2024 04:54 PM Views : 174

Studio18 News - TELANGANA / : కేంద్రబడ్జెట్‌పై స్పందించని కేసీఆర్... రాష్ట్ర బడ్జెట్‌పై మాత్రం మాట్లాడం విడ్డూరంగా ఉందని మంత్రి సీతక్క అన్నారు. భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ అధినేత విమర్శలు గుప్పించారు. ఆయన వ్యాఖ్యలపై సీతక్క స్పందిస్తూ... కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దీనిని నిరసిస్తూ నిన్న అసెంబ్లీలో తీర్మానం చేస్తే కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే అసెంబ్లీకి వచ్చిన మొదటి రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ మెప్పు కోసం రాష్ట్ర బడ్జెట్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరు నెలల తర్వాత అసెంబ్లీ సమావేశాలకు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆగ్రహం ఎన్నడూ లేనివిధంగా కేసీఆర్ మీడియా పాయింట్‌కు వచ్చారని... తొందరలోనే ఆయన బోను ఎక్కేస్తారని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఊహల్లో బతికిన కేసీఆర్.. ఇంకా తానే రాజును అని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో... బీఆర్ఎస్ ఉన్న పదేళ్లలో వాటికి నిధులే ఇవ్వలేదని విమర్శించారు. బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉందని అందుకే ప్రతిపక్షానికి మింగుడు పడటం లేదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వం గంగలో కలిపిందన్నారు. అన్ని శాఖలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చామని మరో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఒక్కో రంగానికి ఇచ్చే నిధులను విపులంగా వివరించినట్లు చెప్పారు. గతంలో బడ్జెట్ పేపర్లకు పరిమితమయ్యేదన్నారు. కేసీఆర్ ఇంకా ఊహల్లో ఉండకుండా బడ్జెట్‌ను ఆహ్వానించాలన్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాసంక్షేమ బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. పదేళ్ల పాటు నీటిపారుదల ప్రాజెక్టులు అంటూ డబ్బులు తగలేశారని గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అన్ని రంగాలకు, సంక్షేమానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించామన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :