Wednesday, 30 April 2025 08:20:42 AM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

KTR: కేంద్రానికి మీరు మద్దతిచ్చారన్న రేవంత్ రెడ్డి... యస్, ఆ సమయంలో కచ్చితంగా ఇచ్చామన్న కేటీఆర్!

Date : 24 July 2024 02:59 PM Views : 99

Studio18 News - TELANGANA / : తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మోదీ ప్రభుత్వం పెట్టిన ప్రతి బిల్లుకు మద్దతు పలికారని సీఎం విమర్శిస్తే... అవసరమైన వాటికి కచ్చితంగా మద్దతిచ్చామని... కానీ రైతు చట్టాల వంటి వాటికి మాత్రం దూరం జరిగామని కేటీఆర్ తెలిపారు. కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. అదానీలతో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కయిందని కేటీఆర్ ఆరోపించారు. అదానీ, అంబానీలతో కుమ్మక్కు కావాల్సిన అవసరం తమకు లేదని సీఎం అన్నారు. అసలు కేసీఆరే కేంద్రం తెచ్చిన ఎన్నో చట్టాలకు మద్దతు తెలిపారని ఆరోపించారు. నోట్ల రద్దు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు... ఇలా ఎన్నింటికో మద్దతు తెలిపారన్నారు. నోట్ల రద్దు గొప్ప నిర్ణయమని కేసీఆర్ అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు గాలి మాటలు మాట్లాడవద్దని సూచించారు. బీఆర్ఎస్ రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. మీరు చేసిన అప్పుకు వడ్డీలు కట్టలేని పరిస్థితి ఉందని కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రజలు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓడించినా బీఆర్ఎస్‌లో అహం తగ్గలేదన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకుంటే మంచిదని సూచించారు. తాము కేంద్రానికి భయపడుతున్నట్లుగా కేటీఆర్ చెబుతున్నారని... కానీ ఇదివరకు మోదీకి కేసీఆరే ఊడిగం చేశారన్నారు. జీఎస్టీ తెచ్చినప్పుడు బీఆర్ఎస్ కేంద్రానికి మద్దతు పలికిందన్నారు. పైగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి జీఎస్టీ బిల్లుకు మద్దతు తెలిపారని విమర్శించారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు ప్రత్యేక విమానంలో వెళ్లి ఆర్టీఐ సవరణకు ఓటు వేశారన్నారు. యస్... కచ్చితంగా అందుకే ఓటేశాం: కేటీఆర్ కేంద్రం తీసుకువచ్చిన ప్రతి బిల్లుకు తాము మద్దతు పలికినట్లుగా సీఎం చెబుతున్నారని కానీ అందులో వాస్తవం లేదన్నారు. దళితుడైన రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి అవుతుంటే, తెలుగువాడైన వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అవుతుంటే తాము కచ్చితంగా మద్దతు పలికామన్నారు. అవును... కేంద్రానికి ఈ విషయాల్లో కచ్చితంగా మద్దతిచ్చామన్నారు. కానీ రైతు చట్టాలకు తాము మద్దతివ్వలేదని స్పష్టం చేశారు. అయినా రేవంత్ రెడ్డి ఢిల్లీలో బీజేపీకి మద్దతిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ మీద ముఖ్యమంత్రి ఇష్టారీతిన మాట్లాడలేదన్నారు. తాము గెలవలేదని రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని... తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ రేవంత్ రెడ్డిలా తాము పరాన్నజీవులం కాదని... ఉద్యమం సమయంలో పదవులకు రాజీనామా చేశామన్నారు. బీజేపీతో చీకటి ఒప్పందం ఉన్నదే రేవంత్ రెడ్డికి అన్నారు. సింగరేణిపై చర్చకు సిద్ధం: భట్టివిక్రమార్క సింగరేణి అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. కేటీఆర్ వివిధ అంశాలపై సభతో పాటు రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. హైదరాబాద్ పవర్ సర్కిల్‌ను ప్రైవేటు వాళ్లకు ఇస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదన్నారు. ఎవరో పత్రికలో రాసిన దానిని పట్టుకొని సభలో మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్లలా ఏది పడితే అది చేసేవాళ్లం కాదన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :