Studio18 News - TELANGANA / NIZAMABAD : ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన 12 గ్రామాల సర్పంచులకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచులకు జిల్లా కేంద్రంలోని ఎన్ఏసీ భవనంలో ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఎంపీఓ రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు శిక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. గ్రామ పరిపాలన, సర్పంచుల బాధ్యతలపై జిల్లా అధికారులు, డీపీఓ, టీఎల్పీవోలు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం సర్పంచులకు సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు వెల్లడించారు.
Admin
Studio18 News