Studio18 News - TELANGANA / HYDERABAD : రాష్ట్రవ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు 11వ తేదీన పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 వరకు పోలింగ్ ఈ నెల 13న ఓట్ల లెక్కింపు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఈరోజుతో ప్రచారం ముగియడంతో రాష్ట్రంలో మైకులు మూగబోయాయి. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనివార్యమైతే ఈ నెల 12న రీపోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13 ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. గెలిచిన వారు మరుసటి రోజు వార్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఫిబ్రవరి 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.
Admin
Studio18 News