Studio18 News - TELANGANA / HYDERABAD : శ్రీరామనవమి సందర్భంగా కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయంలో నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హాజరుకావలసిందిగా, దేవాలయంలో సంప్రదాయంగా కొనసాగుతున్న ఆనవాయితీ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో భాగంగా దేవాలయ ఈవో శ్రీమతి లావణ్య అధికారిక ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయం మాజీ ధర్మకర్త ఛాతిరి మధు సాగర్ పాల్గొన్నారు. వేద పండితులు చంద్రకాంత్ శర్మ, ముత్యాల శర్మ వేద ఆశీర్వచనాలు అందజేశారు.
Admin
Studio18 News