Wednesday, 25 June 2025 07:48:42 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

బాసర ఆలయ ప్రధాన అర్చకుడుపై దాడి అమానుషం

టీబీఎస్ఎస్ఎస్ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ సముద్రాల విజయసారథి

Date : 19 May 2025 01:48 PM Views : 3978

Studio18 News - TELANGANA / JAGTIAL : జగిత్యాల (స్టూడియో 18 న్యూస్ ప్రతినిధి) : నిర్మల్ జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం బాసర శ్రీజ్ఞానసరస్వతి ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారిపై జరిగిన దాడిని ఖండిస్తూ బ్రాహ్మణ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని TBSSS రాష్ట్ర కోశాధికారి సముద్రాల విజయసారధి, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కే౦ద్రంలో బ్రాహ్మణ సంఘాల నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. నిత్యం అమ్మవారి సేవలో కాలంగడిపే బాసర శ్రీజ్ఞానసరస్వతి ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారిపై దాడి చేయడం అమానుషమని, ఇటివలి కాలంలో బ్రాహ్మణ జాతిపై విద్వేషాన్ని రగిలిస్తూ బ్రహ్మణులపై కొంతమంది అవాకులు, చెవాకులు పెలుతున్నారని, మరోవైపు ప్రత్యక్ష దాడులకు సైతం పాల్పడుతున్నారని మండిపడ్డారు. సమాజక్షేమంకోరి నిత్యం దైవారాధనలో నిమగ్నమయ్యే బ్రాహ్మణులపై దాడులు తగదని హితవు పలికారు. ఇప్పటికైన బ్రాహ్మణ జాతిపై దాడులను ఆపాలని, మరొక మారు ఇలాంటివి జరగకుండా బ్రాహ్మణ జాతి రక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రహ్మణ జాతిపై దాడి చేసే ఎంతటి వారికైన కటిన శిక్షలు అమలు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. బాసర ఆలయ పూజరిపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ చేపట్టి నిందితులను కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీబీఎస్ఎస్ యువ నాయకులు ధీరజ్ కృష్ణమాచారి, యశస్వి భరద్వాజ్, జగిత్యాల బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు చాకుంట వేణు మాధవరావు, సిరిసిల్ల రాజేంద్ర శర్మ తదితరులు పాల్గోన్నారు.

Also Read : శశిథరూర్‌పై వేటేద్దామా? వద్దా?.. డైలమాలో కాంగ్రెస్

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :