Friday, 14 February 2025 06:46:01 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

BRS: రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్

Date : 06 August 2024 06:26 PM Views : 62

Studio18 News - TELANGANA / : కేసీఆర్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అన్నారు. కానీ, ప్రచార ఆర్భాటం కోసం రూ.839 కోట్ల పెట్టుబడులు అని చెప్పి రాష్ట్రంలోకి మరో బోగస్ కంపెనీని తీసుకువస్తే ఎలా? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. పెట్టుబడులు తీసుకురావడంలో కేటీఆర్‌తో పోటీ పడాలని సూచించారు. కానీ ఫ్రాడ్ కంపెనీలు, బోగస్ కంపెనీలు తెచ్చి ప్రచారం ఎందుకు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... సీఎంగా ఎవరిని కలిసినా, ఎవరితో వ్యాపారం చేసినా వారి ట్రాక్ రికార్డ్ బాగుండాలని సూచించారు. ఇలా ఎవరిని పడితే వాళ్లను కలిసి, స్ట్రైక్‌ఆఫ్‌ అయిన కంపెనీతో ఒప్పందాలు చేసుకుని వస్తే ఎవరూ ఊరుకోరన్నారు. కేసీఆర్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఐటీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయన్నారు. 2022-23 చూస్తే ఐటీ ఎగుమతులు రూ.57,706 కోట్లుగా ఉందని, 2023-24కి వచ్చేసరికి ఐటీ ఎగుమతులు రూ.26,948 కోట్లకు పడిపోయాయన్నారు. కాంగ్రెస్ పాలనలో పెట్టుబడులు సగానికి పడిపోయాయని విమర్శించారు. గతంలో దావోస్‌కు వెళ్లినప్పుడు రేవంత్ రెడ్డి చాలా ప్రచారం చేసుకున్నారని గుర్తు చేశారు. దావోస్‌లో గోధి ఇండియా అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారని, రూ.27 లక్షల వార్షిక లాభం లేని సంస్థ ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు ఎలా పెడుతుందని ప్రశ్నించారు. యాన్యువల్ స్టేట్‌మెంట్ తెప్పించి అడిగితే ముఖ్యమంత్రి గప్‌చుప్‌ అయ్యారని విమర్శించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై రూ.లక్షన్నర కోట్లకు అంచనాలను పెంచారని విమర్శించారు. ఈ ప్రాజెక్టును మెయిన్ హార్ట్ అనే సంస్థకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం చూస్తోందన్నారు. మెయిన్‌ హార్ట్ సంస్థ పాకిస్థాన్‌లో రూ.3000 కోట్లు దోచుకుని పారిపోయి వచ్చిందన్నారు. ఆ సంస్థపై ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, ఫెడరల్ ఏజెన్సీలు లుకౌట్ నోటీసులు ఇచ్చాయన్నారు. ఈ రెండు ఇలా ఉంటే, తెలంగాణలో రూ.839 కోట్ల పెట్టబడులకు వాల్ష్ కర్రా హోల్డింగ్స్‌తో ఒప్పందం జరిగిందని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార ఆర్భాటం కోసం రూ.839 కోట్ల పెట్టుబడులని చెప్పి రాష్ట్రంలోకి మరో బోగస్ కంపెనీని తీసుకువస్తే ఎలా? అన్నారు. వాల్ష్ కర్రా హోల్డింగ్స్‌ అనే కంపెనీ నాలుగు నెలల క్రితమే ప్రారంభమైందన్నారు. ఈ కంపెనీలో ఇద్దరే డైరెక్టర్లు ఉన్నారని చెప్పారు. వీళ్ల యాన్యువల్ స్టేట్‌మెంట్స్, రిపోర్ట్స్, పాత ట్రాక్‌ రికార్డులు ఏమీ లేవన్నారు. అలాంటివారు రూ.839 కోట్లు తీసుకొచ్చి తెలంగాణలో పెట్టుబడి ఎలా పెడతారన్నారు. ఫ్రాడ్‌ కంపెనీల కోసం రేవంత్‌ రెడ్డి అమెరికా వెళ్లారా? అని నిలదీశారు. తానేదో కేటీఆర్ కంటే మెరుగ్గా పని చేస్తున్నానని చెప్పుకోవడం కోసం సీఎం అమెరికా వెళ్లారని ఎద్దేవా చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :