Sunday, 08 March 2026 10:07:48 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

KTR: విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ 'ఆల్ ది బెస్ట్'

Date : 04 August 2024 01:24 PM Views : 454

Studio18 News - TELANGANA / : పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి బృందానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'ఆల్ ది బెస్ట్' చెప్పారు. రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులను ట్యాగ్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు ఇచ్చిన సీఎం బృందం షెడ్యూల్‌ను తాను చూశానన్నారు. ఏళ్లుగా ఎంతో కష్టపడి తాము పట్టుదలతో సంబంధాలను పెంపొందించామని, ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రముఖ కంపెనీల నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే ఉన్న కంపెనీలు విస్తరణకు ఆసక్తి చూపిస్తున్నాయంటే ఇందుకు తెలంగాణ పారిశ్రామిక విధానాలు, విజయాలే నిదర్శనమని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఆర్థికాభివృద్ధికి అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించినట్లు తెలిపారు. తాము టీఎస్-ఐపాస్ వంటి అనేక వినూత్న విధానాలు తీసుకువచ్చామని గుర్తు చేశారు. భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాలలో గణనీయమైన పెట్టుబడులు పెట్టామన్నారు. గత దశాబ్దంలో, ఈ ప్రయత్నాల ఫలితంగా రూ.4,00,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించినట్లు తెలిపారు. దీంతో పాటు వివిధ రంగాల్లో 24 లక్షలకు పైగా ప్రైవేట్ రంగ ఉద్యోగాలను సృష్టించామన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి, 'తెలంగాణ ఫస్ట్' అనేదే తమ నినాదం అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యక్ష పెట్టుబడులను తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే బీఆర్ఎస్ నిర్మించిన బలమైన పునాదిని కొనసాగించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :