Friday, 14 February 2025 08:29:13 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Telangana: పాఠశాలల పరిశుభ్రత కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Date : 05 August 2024 05:42 PM Views : 72

Studio18 News - TELANGANA / : పాఠశాలల పరిశుభ్రత కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 'అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ'కి స్కూళ్ల పరిశుభ్రత బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం గ్రాంట్స్ మంజూరు చేసింది. పాఠశాలల నిధులకు అదనంగా ఈ గ్రాంట్‌ను కేటాయించినట్లు తెలిపింది. తెలంగాణలోని పాఠశాలల్లో పరిశుభ్రత కొరవడిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 30 లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలకు రూ.3 వేలు, 31 నుంచి 100 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు రూ.6 వేలు, 101 నుంచి 200 మంది ఉంటే రూ.8 వేలు, 251 నుంచి 500 లోపు విద్యార్థులు ఉంటే రూ.12 వేలు, 501 నుంచి 750 మంది వరకు విద్యార్థులు ఉంటే రూ.15 వేలు, 750 కంటే ఎక్కువ మంది ఉంటే రూ.20 వేల చొప్పున గ్రాంట్ ఇవ్వనుంది. మొత్తం 10 నెలల కాలానికి ఒకేసారి నిధులు విడుదల చేస్తారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :