Monday, 16 March 2026 01:54:07 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Date : 07 March 2026 07:25 PM Views : 17

Studio18 News - TELANGANA / KARIMNAGAR : కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పలు గ్రామాలను పర్యటించారు. ఈ పర్యటనలో గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, కొప్పుల ఈశ్వర్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో కొండన్నపల్లి వరద కాలువను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి కాలువ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని ఆయన విమర్శించారు. అదే కాళేశ్వరం మోటార్ల ద్వారా ప్రాజెక్టులు, వరద కాలువలకు నీరు అందుతున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తేనే రైతులకు నీరు అందించే పరిస్థితి వచ్చిందని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల ఎకరాల సాగుకు జీవనాడిగా ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. రెండున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం నిర్మించిన చెక్ డ్యాంలు, ప్రాజెక్టులు ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కుంగిపోయిన ప్రాజెక్ట్ భాగాలను వెంటనే మరమ్మతులు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. గంగాధర చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి హరీష్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. గోపుల్ రావ్ పల్లెలో అడుగంటిన పంట పొలాలు, బావులను పరిశీలించిన అనంతరం రైతుల బాధలను తెలుసుకున్నారు. తదనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :