Studio18 News - TELANGANA / RANGAREDDY : చైతన్యపురి డివిజన్లో ప్రస్తుతం దోమల సమస్య తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని డివిజన్ మొత్తం వారానికి కనీసం మూడు నుండి నాలుగు సార్లు రెగ్యులర్గా ఫాగింగ్ నిర్వహించాలని కోరారు. అలాగే లార్వా నివారణ చర్యలను కూడా మరింత బలంగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా చైతన్యపురి డివిజన్ అభివృద్ధి కోసం మంజూరైన సుమారు రూ.1 కోటి విలువైన అభివృద్ధి పనులు ఇప్పటివరకు టెండర్లు పూర్తయినప్పటికీ ప్రారంభం కాలేదని పేర్కొంటూ, వాటిని వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను కోరారు. చైతన్యపురి డివిజన్లో రోజురోజుకు పెరుగుతున్న వీధి కుక్కల సమస్యపై కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రజలు, ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ పశువైద్య విభాగం ద్వారా వెంటనే చర్యలు తీసుకొని వీధి కుక్కల నియంత్రణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ మాజీ బీజేపీ కార్పోరేటర్లు, జీహెచ్ఎంసీ అధికారులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Studio18 News