Saturday, 22 March 2025 07:54:18 AM
# NPCI: ఇనాక్టివ్ ఫోన్ నెంబర్లకు యూపీఐ సేవల నిలిపివేత # Honey Trap: కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఆరు నెలల పాటు సస్పెన్షన్ వేటు # Posani Krishna Murali: పోసానికి ఊరట... సీఐడీ కేసులో బెయిల్ మంజూరు # Rajitha Mother : టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటి తల్లి కన్నుమూత.. # తిరుమలలో చంద్రబాబు సంచలన ప్రకటన.. వారికిచ్చిన 35 ఎకరాలు క్యాన్సిల్.. # Tirumala: నారా దేవాన్ష్​లా మీరూ టీటీడీ అన్నప్రసాదం ట్ర‌స్టుకు విరాళం ఇవ్వొచ్చు.. దేనికి ఎంత ఖర్చు అవుతుందంటే? # Chiranjeevi : చిరంజీవి ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో డబ్బులు వసూలు.. సోషల్ మీడియాలో హెచ్చరించిన మెగాస్టార్.. # Tech Tips in Telugu : వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్ వేడెక్కడానికి అసలు కారణాలివే.. ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు.. బ్యాటరీ సేవింగ్ స్మార్ట్ టిప్స్..! # IPL 2025: కొత్తగా మూడు రూల్స్‌ తీసుకొచ్చిన బీసీసీఐ.. అవేంటంటే? # Telangana : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి.. # Chiranjeevi : పీఎం మోదీ ఆ రోజు నాతో ఏం మాట్లాడారంటే.. కన్నీళ్లు వచ్చాయంటూ.. చిరు వ్యాఖ్యలు వైరల్.. # పర్ఫార్మెన్స్, డిజైన్ రెండింటిలోనూ అద్భుతంగా ఉంటుందని స్మార్ట్‌ప్రిక్స్ రిపోర్టు తెలిపింది. ఐక్యూ Z10 సిరీస్‌లో Pro, Z10x వేరియంట్ కూడా ఉంటుందని గతంలో # Telangana Assembly: సై అంటే సై.. అసెంబ్లీలో రగడ.. హరీశ్ రావు వర్సెస్ కోమటిరెడ్డి.. # Gold Price: రాబోయే మూడు నెలల్లో బంగారం ధరలు ఎంతగా పెరుగుతాయో తెలుసా? # MG Comet EV 2025 : కొంటే ఇలాంటి కారు కొనాలి.. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు రేంజే వేరబ్బా.. సింగిల్ ఛార్జ్‌తో 230కి.మీ దూసుకెళ్తుంది..! # Gold: బాబోయ్.. బంగారం రికార్డులే రికార్డులు.. ఆశ్చర్యపరుస్తున్న డబ్ల్యూజీసీ తాజా గణాంకాలు.. 2025 చివరి నాటికి.. # Tata Car Prices : కొత్త కారు కావాలా? ఏప్రిల్‌లో భారీగా పెరగనున్న టాటా PV, EV కార్ల ధరలు.. ఇప్పుడు కొంటేనే బెటర్..! # Mahesh Babu – Sitara : మహేష్ బాబుకే నేర్పిస్తున్న కూతురు సితార.. జెన్ జీ అంటే అట్లుంటది మరి.. వీడియో వైరల్.. # McDonald’s: గుడ్‌న్యూస్‌.. తెలంగాణ నుంచి ఇవి కొనేందుకు మెక్‌డొనాల్డ్స్‌ రెడీ.. ఇక మనవాళ్లకి లాభాలు.. # Affordable SUV Cars : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. రూ.10లక్షల లోపు SUV కార్లు.. టాప్ 5 మోడల్స్ ఇవే..!

కాంగ్రెస్‌ను ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు: జగదీశ్ రెడ్డి

ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు రేవంత్‌ను చూసి భయపడే పరిస్థితి ఉందన్న మాజీ మంత్రి రేవంత్ రెడ్డి చెడ్డపేరు తెచ్చుకొని చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నారని ఎద్

Date : 12 November 2024 05:19 PM Views : 88

Studio18 News - TELANGANA / : కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసి ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... వికారాబాద్‌లో నిన్న అధికారులపై జరిగిన దాడితో రేవంత్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందన్నారు. కేసీఆర్‌ను నోటికి వచ్చినట్లు బూతులు తిట్టి సీఎం టైంపాస్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు కేసీఆర్‌ను మరిచిపోయారని చెబుతూనే... పదేపదే కేసీఆర్‌ను తలుచుకుంటూ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. చెడ్డపేరు తెచ్చుకొని చరిత్రలో నిలిచిపోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. నిన్నటి దాడి ఘటన వెనుక బీఆర్ఎస్ కుట్ర అని చెప్పడం విడ్డూరమని, మేధావులు వెళ్లి అసలు విషయం తెలుసుకోవాలన్నారు. ఢిల్లీకి 25 సార్లు వెళ్లిన రేవంత్ రెడ్డి ఎవరి కాళ్లు మొక్కారో చెప్పాలని చురక అంటించారు. కేటీఆర్ ఎందుకు ఢిల్లీ వెళ్లారో మీ ఇంటెలిజెన్స్ ద్వారా కనుక్కోవచ్చని సూచించారు. కాంగ్రెస్, బీజేపీల బండారం బయటపెట్టేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని పేర్కొన్నారు. ఏ సమయంలో బయటకు రావాలో కేసీఆర్‌కు తెలుసని... ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ ఓ వ్యక్తి కాదని.. శక్తి అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఓవైపు రివ్యూ చేస్తున్నట్లు నటిస్తూనే... మరోవైపు ప్లాన్ ప్రకారం మిల్లర్లను, దళారీలను రైతుల మీదకు వదిలారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. దీని వెనుక వందల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దళారులు, మిల్లర్లతో మంత్రులు కుమ్మక్కు అయ్యారన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం రైతులతో ఆడుకుంటోందన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేశామన్నారు. రైతుల వద్ద ధాన్యం కొనకుండా అధికారులను నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి బెదిరిస్తున్నారని ఆరోపించారు. దళారులతో కుమ్మక్కు కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. రైతులు దోపిడీకి గురవుతున్నారని... దీనికి వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు గింజ ధాన్యం కొనుగోలు చేయలేదని... రైతులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పేందుకు అధికారులు భయపడుతున్నారన్నారు.

Also Read : అమ్మకాల ఎఫెక్ట్... నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :