Monday, 17 February 2025 03:27:53 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

KTR: రుణ‌మాఫీపై సీఎం మాట‌ల‌న్నీ అబ‌ద్ధాలే: కేటీఆర్‌

Date : 04 October 2024 02:37 PM Views : 63

Studio18 News - TELANGANA / : రైతు రుణ‌మాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాట‌ల‌న్నీ ప‌చ్చి అబ‌ద్ధాలేనంటూ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాజాగా వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ 20 ల‌క్ష‌ల మందికి రుణ‌మాఫీ కాలేదని చెప్ప‌డంతో ముఖ్య‌మంత్రి బండారం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింద‌ని తెలిపారు. ఎక్స్ వేదిక‌గా కేటీఆర్ ఈ మేర‌కు పోస్ట్ చేశారు. వంద శాతం రుణ‌మాఫీ పూర్తి చేశామ‌న్న సీఎం మాట‌ల‌న్నీ డొల్ల‌మాట‌లేన‌ని ఇంకోసారి తేలిపోయింది. ఓ వైపు డిసెంబ‌ర్ 9న ఏక కాలంలో రుణ‌మాఫీ చేస్తామ‌ని మోసం చేసి.. మరోవైపు 10 నెల‌లైనా 20 ల‌క్ష‌ల మందికి అందించ‌కుండా ద‌గా చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. రెండు ల‌క్ష‌ల రుణ‌మాఫీ పూర్త‌యిపోయింద‌న్న సీఎం మాట‌లు ప‌చ్చి అబ‌ద్ధాలు అని విమ‌ర్శించారు. చేస్తామ‌న్న రుణ‌మాఫీ ఇప్ప‌టికీ పూర్తి చేయ‌లేద‌ని, ఇవ్వాల్సిన రైతుబందు సీజ‌న్ ముగిసినా ఇవ్వ‌లేదంటూ బీఆర్ఎస్ నేత మండిప‌డ్డారు. అధికారిక లెక్క‌ల ప్ర‌కారం 20 ల‌క్ష‌ల మంది రైతుల‌కు అన్యాయం జ‌రిగితే.. అనాధికారికంగా ఇంకా ఎంతమంది అన్న‌దాత‌లు ఉన్నారోన‌ని కేటీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :