Friday, 14 February 2025 07:49:47 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

MLC Kavitha : సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

Date : 10 August 2024 10:21 AM Views : 57

Studio18 News - TELANGANA / : MLC Kavitha : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. ఈ మేరకు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జూలై 1న హైకోర్టు కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆమె ఆశ్రయించారు. ఢిల్లీ, లిక్కర్‌ పాలసీకి సంబంధించి ఈడీ, సీబీఐ కేసులలో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఆగష్టు 12 సుప్రీంకోర్టు విచారించనుంది. న్యాయమూర్తులు జస్టిస్ విశ్వనాథ్‌, జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ కేసును విచారించనుంది. ఇప్పటికే కవితకు బెయిల్ మంజూరు చేసేందుకు ట్రయల్ కోర్టు, హైకోర్టు నిరాకరించాయి. సుమారు ఐదు నెలలుగా తీహార్ జైలులోనే కవిత ఉంటోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీలాండరింగ్‌ కేసులో ఎమ్మెల్సీ కవితను గత మార్చి 15న ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ అధికారులు సైతం విచారణ చేపట్టారు. గత ఏప్రిల్ 11న ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేయగా, ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ కోర్టులు కూడా జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీని పొడిగిస్తున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :