Friday, 14 February 2025 07:37:02 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. మూత్ర విసర్జన చేస్తుండగా కారు టైర్ ఢీకొని ఆరేళ్ల బాలుడు మృతి

Date : 26 July 2024 10:27 AM Views : 55

Studio18 News - TELANGANA / : Outer Ring Road : హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు టైరు ఢీకొని మూత్ర విసర్జన చేస్తున్న ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా.. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం బాలుడు కన్నుమూశాడు. ఈ ఘనటపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమీన్ పూర్ మండలం పటేల్ గూడ గ్రామానికి చెందిన సందీప్ రెడ్డి ఆదివారం రాత్రి ముత్తంగి దాబాలో భోజనం చేసేందుకు కారులో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. సుల్తాన్ పూర్ వద్ద ఓఆర్ఆర్ ఎక్కిన కొద్దిసేపటికి అతని కుమారుడు మోక్షిత్ రెడ్డి (6) మూత్రం వస్తుందని చెప్పడంతో కారు ఓఆర్ఆర్ పక్కన నిలిపాడు. మోక్షిత్ రెడ్డి రోడ్డు పక్కకు వెళ్లి మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన వేగంగా దొర్లుకుంటూ వచ్చిన కారు టైరు బాలుడ్ని ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన తల్లిదండ్రులు వెంటనే ముత్తంగిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం వేరే ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం బాలుడు మృతి చెందాడు. ఊహించని ఘటనతో బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, బాలుడిని ఢీకొట్టిన కారు టైరు ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఓఆర్ఆర్ పై వెళ్తుండగా ఏదైనా వాహనం టైరు ఊడిపోయి ఉండవచ్చునని, అది వేగంగా వచ్చి బాలుడిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :