Sunday, 29 March 2026 05:20:54 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Seethakka: పేదరిక నిర్మూలనకు సరికొత్త పథకం తీసుకొస్తున్నాం: మంత్రి సీతక్క

Date : 06 February 2026 07:07 PM Views : 35

Studio18 News - TELANGANA / HYDERABAD : కేరళలో అమలు చేస్తున్న 'కుటుంబశ్రీ' తరహా పథకం తెస్తున్నామన్న సీతక్క సర్వే చేయించి పేదరికంలో ఉన్నవారిని గుర్తిస్తామన్న మంత్రి ప్రతి పేద కుటుంబానికి సాయం అందిస్తామని వెల్లడి తెలంగాణ మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు రాష్ట్రంలో కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. కేరళలో అమలు చేస్తున్న 'కుటుంబశ్రీ' మోడల్ ను అనుసరించి ఈ పథకానికి రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. కేరళలో ఒక సర్వే నిర్వహించారని... దాని ద్వారా 65 వేల మంది పేదలను గుర్తించి, వారిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చారని సీతక్క తెలిపారు. అదే తరహాలో తెలంగాణలో మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా సర్వే చేయించి, పేదరికంలో ఉన్న వారిని గుర్తిస్తామని చెప్పారు. సర్వే పూర్తయిన తర్వాత ప్రతి పేద కుటుంబానికి తగిన సాయం అందిస్తామని సీతక్క తెలిపారు. ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడినా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఈ కొత్త పథకం ద్వారా రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :