Studio18 News - TELANGANA / JAGTIAL : జగిత్యాల పట్టణం గొల్లపల్లి రోడ్లో గల సత్య హరిచంద్ర స్మశాన వాటికలో రోటరీ మరియు రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమం, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా రోటరీ మరియు రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. హైదరాబాద్ మహాప్రస్థానం తరహాలో అత్యున్నత సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పుట్టిన వారు ఎప్పటికైనా చనిపోవడం సహజమని, చనిపోయిన తర్వాత వారి ఆత్మ ప్రశాంత వాతావరణంలో ఉండే విధంగా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. పట్టణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని పేర్కొంటూ రోటరీ, రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో స్మశాన వాటిక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు అరవ లక్ష్మీ, పద్మ సింగరావు, రాగుల ప్రదీప్, పిట్ట ధర్మరాజు, బొలుసాని శ్రీనివాస్, రోటరీ క్లబ్ అధ్యక్షులు చారి, రెడ్ క్రాస్ సభ్యులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్, టీవీ సూర్యం, బోడ్ల జగదీష్, వేణుగోపాల్, నాయకులు సుధాకర్ రావు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, కౌన్సిలర్లు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది, ఎన్సీసీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News