Wednesday, 11 March 2026 11:43:04 AM
# సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన # అంగన్వాడీ టీచర్ ఒడ్డేపల్లి రాజేశ్వరికు బెస్ట్ టీచర్ అవార్డు # టేకులబస్తిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ స్లాబ్ పనులు ప్రారంభం # విలేకరి చంద్రశేఖర్‌పై నమోదైన కేసు రద్దు చేయాలి: బీజేపీ నాయకుడు కొయ్యల ఏమాజి # బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ కూనురాజుల సమ్మక్కకు పిహెచ్డీ డాక్టరేట్ # మందమర్రి పెద్ద మసీదులో రంజాన్ తోఫా కార్యక్రమం… మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొనం # నాగర్ గూడ శివారులో సీజ్ చేసిన ఇసుకకు బహిరంగ వేలం # బీజేపీ పోరాటంతో భూదాన్ బాధితులకు ఇళ్ల పట్టాలు # కోమట్లగూడెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి జాతర సందర్భంగా డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం # కుషాయిగూడలో ఘనంగా రేణుక ఎల్లమ్మ–జమదగ్ని మహాముని కళ్యాణ మహోత్సవం

బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ కూనురాజుల సమ్మక్కకు పిహెచ్డీ డాక్టరేట్

Date : 11 March 2026 08:02 AM Views : 21

Studio18 News - TELANGANA / MANCHERIAL : మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్ సీనియర్ అతిథి లెక్చరర్‌గా పనిచేస్తున్న కూనురాజుల సమ్మక్క పిహెచ్డీ డాక్టరేట్ అందుకున్నారని కళాశాల ప్రిన్సిపాల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఉన్న సబర్మతి విశ్వవిద్యాలయంలో సమ్మక్క పార్ట్ టైం పిహెచ్డీ చేశారు. ఆ యూనివర్సిటీలో సూపర్వైజర్ డాక్టర్ శివకుమార్ వైష్ గైడ్‌షిప్‌లో “ఎ సోసియో పొలిటికల్ స్టడీ ఆఫ్ ట్రైబల్ ఉమెన్స్ రోల్ ఇన్ ది పంచాయతీరాజ్ ఇన్‌స్టిట్యూషన్స్” అనే అంశంపై పరిశోధన నిర్వహించారు. పరిశోధన పూర్తి కావడంతో యూనివర్సిటీలో ఓపెన్ వైవా నిర్వహించగా, సమ్మక్క వివరించిన పరిశోధన అంశాలు ఎగ్జామినర్లను సంతృప్తి పరచడంతో ఆమెకు పిహెచ్డీ డాక్టరేట్ ప్రకటించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మహమ్మద్ ఖాసిం బస్తికి చెందిన కూనురాజుల సమ్మక్క అకాడమిక్ విద్య పూర్తి చేసిన అనంతరం 2000 సంవత్సరం నుండి బెల్లంపల్లి క్లబ్ మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యా వాలంటీర్ ఉపాధ్యాయురాలిగా చేరారు. అనంతరం బెల్లంపల్లి టేకుల బస్తి హై స్కూల్‌లో కంప్యూటర్ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. బెల్లంపల్లి బజార్ ఏరియా బ్రాంచ్ హై స్కూల్‌లో విద్యా వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తూ ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు తరగతులు బోధించారు. 2022 నుండి బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్ అతిథి అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2024 నుండి బెల్లంపల్లి ప్రభుత్వ పీజీ కళాశాలలో పీజీ ఎంఏ పొలిటికల్ సైన్స్ విద్యార్థులకు తరగతులు బోధిస్తూ విధులు కొనసాగిస్తున్నారు. ఈ విధంగా పాతికేళ్లకు పైగా ఆమె విద్యారంగంతో అనుబంధం కలిగి ఉన్నారు. కూనురాజుల సమ్మక్క సబర్మతి విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ సీటు పొంది పరిశోధన పూర్తి చేసి ఉన్నత డిగ్రీని సాధించడం పట్ల యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, పొలిటికల్ సైన్స్ విభాగం డీన్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యులు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఆమె తల్లిదండ్రులు కూనురాజుల వెంకటి, లక్ష్మి, పోసు, అన్నయ్య కూనురాజుల శ్రీనివాస్, వదినలు, అల్లుళ్లు, అక్కలు, భావలు, చెల్లెలు, కుటుంబ సభ్యులు, బంధువులు, ఊరి ప్రజలు, బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్, వైస్ ప్రిన్సిపాల్ మేడ తిరుపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, కళాశాల సూపరింటెండెంట్ పుప్పాల శ్రీనివాస్, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :