Wednesday, 12 November 2025 04:43:20 AM
# Shaheen: మా అమ్మాయి ఉగ్రవాదా?... నమ్మలేకపోతున్నాను!: డాక్టర్ షాహీన్ తండ్రి ఆవేదన # Ajith Kumar: సినీ నటుడు అజిత్ ఇంటికి, కాంగ్రెస్ కార్యాలయానికి బాంబు బెదిరింపు # Ambati Rambabu: ఓ మై గాడ్... నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తోంది: పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు ఫైర్ # Bharati Dixit: ఐఏఎస్ అయిన నా భార్త వేధిస్తున్నాడు.. కిడ్నాప్ కూడా చేశాడు: ఐఏఎస్ అధికారిణి ఫిర్యాదు # Chandrababu Naidu: అమరావతి విచ్చేసిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్... ఏపీ సమస్యలు వివరించిన సీఎం చంద్రబాబు # Jubilee Hills Bypoll: ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్.. క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం # Chhattisgarh Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్... ఆరుగురు మావోయిస్టుల మృతి # Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే గెలుపు: ఎగ్జిట్ పోల్ సర్వేలు # Bihar Elections: బీహార్‌లో మళ్లీ ఎన్డీయే ప్రభంజనం... ముక్తకంఠంతో చెబుతున్న ఎగ్జిట్ పోల్స్‌! # Amit Shah: ఎర్రకోట కారు బాంబు పేలుడు ఘటన... అధికారులకు అమిత్ షా ఆదేశాలు # India Russia Relations: భారతీయులకు రష్యా బంపరాఫర్.. ఏకంగా 70 వేల మందికి ఉద్యోగాలు # Sanju Samson: సంజూ శాంసన్‌కు సీఎస్‌కే బర్త్‌డే విషెస్.. ఆ మెగా డీల్‌పై స్పష్టమైన సంకేతమా? # Delhi Blast: ఢిల్లీని వణికించిన కారు.. చాలా చేతులు మారిందా?.. దర్యాప్తులో కీలక విషయాలు # Delhi blast: పట్టుబడతాననే భయంతోనే.. ఢిల్లీ బాంబు పేలుడులో కీలక విషయం వెలుగులోకి..! # Naseem Shah: పాక్ క్రికెటర్ నసీమ్ షా ఇంటిపై కాల్పులు # HR Department: హెచ్‌ఆర్ పొరపాటు.. సీఈఓ సహా అందరికీ ఫైరింగ్ మెయిల్! # Bellamkonda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై భూకబ్జా కేసు.. ఫిల్మ్‌నగర్‌లో కలకలం # Hijras: కొత్త ఇల్లు కడితే రూ.లక్ష ఇవ్వాలట.. అంత ఇవ్వలేనన్న వ్యక్తిపై హిజ్రాల దాడి # Maganti Sunitha: జూబ్లీహిల్స్‌లో పోలీసుల తీరుపై మాగంటి సునీత ఫైర్.. 14న చూసుకుందామంటూ వార్నింగ్‌! # Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ గాయంపై సంచలన విషయాలు.. అప్పుడు ఆక్సిజన్ 50కి పడిపోయింది!

కాంగ్రెస్ పార్టీలో వారికే పదవులు: దానం నాగేందర్

Date : 10 June 2025 04:05 PM Views : 383

Studio18 News - TELANGANA / : కాంగ్రెస్ పార్టీలో పదవులు ఆశించేవారు కేవలం హామీలపైనే ఆధారపడకూడదని, నిబద్ధతతో పనిచేస్తేనే తగిన గుర్తింపు లభిస్తుందని ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేపట్టిన మంత్రివర్గ విస్తరణ దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందని ఆయన కొనియాడారు. మంగళవారం పలు కార్యక్రమాల్లో దానం నాగేందర్ పాల్గొన్నారు. హిమాయత్‌నగర్‌లో సుమారు 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం, ఆదర్శ్ నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో 150 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక న్యాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ మంత్రివర్గ కూర్పును చేపట్టారని తెలిపారు. "గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కూడా ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎస్సీ, బీసీ వారికి మంత్రివర్గంలో పెద్దపీట వేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయాలను, ఆయన ఆలోచనా విధానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతంగా ముందుకు తీసుకెళుతున్నారు" అని అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధి నుంచి ఎవరికైనా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు దానం నాగేందర్ స్పందిస్తూ, దానికి ఇంకా సమయం ఉందని, అందరూ వేచి చూడాల్సి ఉంటుందని సూచించారు. మంత్రివర్గంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మంత్రులందరికీ ఆయన తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :