Friday, 14 February 2025 07:43:15 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

సుంకిశాల పంప్ హౌస్‌లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన టన్నెల్ రక్షణ గోడ

Date : 08 August 2024 10:59 AM Views : 54

Studio18 News - TELANGANA / : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల పంప్ హౌస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సాగర్ జలాల ఒత్తిడికి ఇన్ టేక్ వెల్ టన్నెల్ రక్షణ గోడ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. అక్కడి కూలీలు షిఫ్ట్ మారడానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పంప్ హౌస్ నీటమునిగినప్పటికీ అధికారులు, నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. వారం రోజుల క్రితమే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ కు చేరేవరకు సుంకిశాల పథకం పనులు నిలిచి పోనుంది. అధికారులు, నిర్మాణ సంస్థ అవగాహన లోపం వల్లే ప్రమాదం జరిగిందంటూ విమర్శలు వస్తున్నాయి. ఆ పంప్ హౌస్‌లో షిఫ్ట్‌కు 115 మంది వరకు కూలీలు పనిలో ఉంటారు. సాగర్ డెడ్ స్టోరేజ్‌కు చేరిన సమయంలో హైదరాబాద్‌కు తాగునీటిని అందించడానికి ఈ పథకాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా సొరంగ మార్గం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సొరంగంలోకి సాగర్ నీరు రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. సాగర్ నిండిపోవడంతో నీటి ఒత్తిడికి రక్షణ గోడ కుప్పకూలింది. కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :