Thursday, 22 May 2025 03:18:18 PM
# చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ సంచలన ఆరోపణలు # రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక # నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్ # అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్ # 32 ఏళ్ల తర్వాత బాలకృష్ణ సినిమాలో విజయశాంతి? # పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు .. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా # సహనం కోల్పోయిన ట్రంప్.. నీకు తెలివి తక్కువ, గెటవుట్ అంటూ రిపోర్ట్‌పై చిందులు

సికింద్రాబాద్‎లో ఉద్రిక్తత.. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసంపై కిషన్‌రెడ్డి ఆగ్రహం

Date : 14 October 2024 12:34 PM Views : 97

Studio18 News - TELANGANA / : Kishan Reddy: సికింద్రాబాద్‌లోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అక్కడకు పలువురు నేతలు, హిందూ సంఘాలు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం జరిగిన ప్రదేశాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీ గణేశ్ పరిశీలించారు. మొదట టెంపుల్ వద్దకు వచ్చిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్‌ను స్థానికులు అడ్డుకున్నారు. గణేశ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ నాయకురాలు మాధవీలత కూడా దేవాలయాన్ని పరిశీలించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అక్కడకు చేరుకుని దేవాలయాన్ని పరిశీలించి మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని అన్నారు. కొందరు మతకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. హిందూ దేవాలయాలపై, విగ్రహాలపై దాడి చేసిన వారు దొంగతనాలు చేయడానికి వచ్చారని, మరికొంతమంది మతిస్థిమితం లేకుండా దాడులు చేస్తున్నారని పోలీసులు చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు. నగరంలో హిందూ పండుగలు జరుగుతున్న వేళ రాత్రి 10 గంటలు దాటిన తర్వాత డీజేలు సౌండ్ సిస్టం పెడితే పోలీసులు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మరి వారు విగ్రహాల ధ్వంసం వంటి ఘటనలు జరిగితే ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఈ ఘటనకు పాల్పడిన వారు ఎంతటి వారైనా అరెస్టు చేసి వారి వెనుక ఎవరెవరి హస్తము ఉందో గుర్తించాలని డిమాండ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :