Friday, 14 February 2025 07:52:31 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

కేసీఆర్‌ను బ‌ద‌నాం చేయాలనే కుట్రలను ఆపండి.. ఆగస్టు 2 వరకు గడువు ఇస్తున్నాం : కేటీఆర్

Date : 26 July 2024 02:13 PM Views : 64

Studio18 News - TELANGANA / : KTR : రాజకీయ కక్షతో కేసీఆర్ ను బద్నాం చేయాలనే పంపులను ఆన్ చేయడం లేదు. రాజకీయాలకోసం ప్రజలను, రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ ను కేటీఆర్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కల్పతరువు అన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులం ప్రాజెక్టును పరిశీలించామని చెప్పారు. ఏ ప్రభుత్వం చేయనంత వేగంగా ప్రాజెక్టు పూర్తిచేశాం. తెలంగాణలో కరువు అనే మాట వినపడవద్దనే సంకల్పంతో ప్రాజెక్టు నిర్మించామని కేటీఆర్ అన్నారు. రెండు జీవనదుల నుంచి నీటిని తీసుకోవాలని బహుళార్థక ప్రాజెక్టు నిర్మించాం. రెండు రోజులు కేసీఆర్ ఆదేశం మేరకు ఎగువ గోదావరి నుంచి దిగువ వరకు పర్యటించామని కేటీఆర్ తెలిపారు. లోయర్, మిడ్ మానేరులో, శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టుల్లో తక్కువ నీటినిల్వ ఉంది. బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. లక్ష్మి పంప్ హౌజ్ నుండి నీళ్లు ఎత్తిపోయవచ్చు అని అధికారులను అడిగాం. నీటిని అందించడం లేదని రైతులు బాధపడుతున్నారని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న సంఘటనను భూతద్దంలోపెట్టి చూస్తున్నారు. రాజకీయం చేయకుండా నీళ్లు అందించాలని కోరుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు. 10లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వెళ్లడం మా కళ్లారా చూశాం. కానీ, పైనఉన్న ప్రాజెక్టులు నీళ్లులేక చూసి బాధపడుతున్నాం. ప్రభుత్వానికి వాడుకునే తెలివి లేదు. 17 పంపులు పని చేస్తున్నాయి. రాజకీయ పరమైన నిర్ణయం లేకపోవడంవల్ల అధికారులు ఏమి చేయలేకపోతున్నారు. కేసీఆర్ ను బదునాం చేయాలనే పంపులు నడపడం లేదు. ఆరు నెలలు రాజకీయం చెద్దాం. నాలుగున్నరేళ్లు అభివృధ్ధికోసం పాటుపడుదామని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టులకు వేరే మార్గం ద్వారా నీళ్లువచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. నీటిని లిఫ్ట్ చేయాలని కేటీఆర్ కోరారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నాం. అసెంబ్లీలో నిలదీస్తాం. ఆగష్టు 2వ తేదీ తర్వాత 50వేల మంది రైతులతో కలిసి వెళ్లి మేమే పంపులు ఆన్ చేస్తామని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :