Friday, 18 July 2025 06:49:34 AM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

కేసీఆర్‌ను బ‌ద‌నాం చేయాలనే కుట్రలను ఆపండి.. ఆగస్టు 2 వరకు గడువు ఇస్తున్నాం : కేటీఆర్

Date : 26 July 2024 02:13 PM Views : 183

Studio18 News - TELANGANA / : KTR : రాజకీయ కక్షతో కేసీఆర్ ను బద్నాం చేయాలనే పంపులను ఆన్ చేయడం లేదు. రాజకీయాలకోసం ప్రజలను, రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ ను కేటీఆర్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కల్పతరువు అన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులం ప్రాజెక్టును పరిశీలించామని చెప్పారు. ఏ ప్రభుత్వం చేయనంత వేగంగా ప్రాజెక్టు పూర్తిచేశాం. తెలంగాణలో కరువు అనే మాట వినపడవద్దనే సంకల్పంతో ప్రాజెక్టు నిర్మించామని కేటీఆర్ అన్నారు. రెండు జీవనదుల నుంచి నీటిని తీసుకోవాలని బహుళార్థక ప్రాజెక్టు నిర్మించాం. రెండు రోజులు కేసీఆర్ ఆదేశం మేరకు ఎగువ గోదావరి నుంచి దిగువ వరకు పర్యటించామని కేటీఆర్ తెలిపారు. లోయర్, మిడ్ మానేరులో, శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టుల్లో తక్కువ నీటినిల్వ ఉంది. బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. లక్ష్మి పంప్ హౌజ్ నుండి నీళ్లు ఎత్తిపోయవచ్చు అని అధికారులను అడిగాం. నీటిని అందించడం లేదని రైతులు బాధపడుతున్నారని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న సంఘటనను భూతద్దంలోపెట్టి చూస్తున్నారు. రాజకీయం చేయకుండా నీళ్లు అందించాలని కోరుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు. 10లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వెళ్లడం మా కళ్లారా చూశాం. కానీ, పైనఉన్న ప్రాజెక్టులు నీళ్లులేక చూసి బాధపడుతున్నాం. ప్రభుత్వానికి వాడుకునే తెలివి లేదు. 17 పంపులు పని చేస్తున్నాయి. రాజకీయ పరమైన నిర్ణయం లేకపోవడంవల్ల అధికారులు ఏమి చేయలేకపోతున్నారు. కేసీఆర్ ను బదునాం చేయాలనే పంపులు నడపడం లేదు. ఆరు నెలలు రాజకీయం చెద్దాం. నాలుగున్నరేళ్లు అభివృధ్ధికోసం పాటుపడుదామని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టులకు వేరే మార్గం ద్వారా నీళ్లువచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. నీటిని లిఫ్ట్ చేయాలని కేటీఆర్ కోరారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నాం. అసెంబ్లీలో నిలదీస్తాం. ఆగష్టు 2వ తేదీ తర్వాత 50వేల మంది రైతులతో కలిసి వెళ్లి మేమే పంపులు ఆన్ చేస్తామని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :