Thursday, 15 May 2025 03:00:15 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

Harish Rao: తాళాలు పగులగొట్టి.. ఆస్తులు ధ్వంసం చేయడం ఏమిటి?: హరీశ్‌రావు ఫైర్

Date : 17 August 2024 12:18 PM Views : 138

Studio18 News - TELANGANA / : రైతు రుణమాఫీ వ్య‌వ‌హారం సిద్దిపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తతకు దారితీసింది. రుణమాఫీ నేపథ్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు రాజీనామా చేయాలంటూ స్థానికంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను తొలగించేందుకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రయత్నించారు. దాంతో వారిని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు. అంతే.. ఈ వివాదం ముదిరి ఇరు పార్టీల‌కు చెందిన‌ మద్దతుదారులు పెద్దఎత్తున రోడ్డుపైకి చేరుకున్నారు. అనంత‌రం ఒక‌రిపై ఒక‌రు నినాదాలతో హోరెత్తించారు. ఈ విష‌యం పోలీసుల‌కు తెలియ‌డంతో అక్కడికి చేరుకుని ఇరుపక్షాలను చెదరగొట్టారు. వారిలో కొంద‌రిని స్టేషన్‌కు కూడా తరలించారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు కొంద‌రు హరీశ్‌రావు క్యాంప్‌ ఆఫీస్‌పై అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీశ్‌రావు ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత‌ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల దాడిని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. తాళాలు పగులగొట్టి.. ఆస్తులు ధ్వంసం చేయడం ఏంట‌ని, రాష్ట్రంలో అప్ర‌జాస్వామ్య పాల‌న కొన‌సాగుతోందని వి‌మ‌ర్శించారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయం అన్నారు. ఒక ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని, ఈ ఘటనపై డీజీపీ చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :