Studio18 News - TELANGANA / HYDERABAD : కేపీహెచ్బీ కాలనీ, మే 9: కేపీహెచ్బీ కాలనీ (KPHB) 6వ ఫేజ్లోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. శుక్రవారం అమ్మవారికి ఏకాదశ దుర్గ సూక్త అభిషేకం, పాలంకరణ సామూహిక శ్రీ చక్ర పూజ బాలముల మంత్ర హోమం పూర్ణాహుతి పూజలు చేశారు. అలాగే శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగింపు చేసి పవలింపు సేవ పూజలు చేశారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కేపీహెచ్బీ కాలనీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాస రావు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీఉమా రామలింగేశ్వర స్వామి కృపతో.. పాకిస్థాన్పై యుద్ధంలో భారతదేశం విజయం సాధించాలని కోరుకుంటూ పూజలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు, తూము శ్రవణ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. అంతకుముందు కూకట్పల్లి రామాలయంలో ఎమ్మెల్యే కృష్ణారావు ప్రత్యేక పూజలు చేశారు. పాకిస్థాన్పై భారత్ చేస్తున్న ఈ ధర్మ యుద్ధంలో గెలవాలని, ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదాన్ని పోషిస్తూ భారతదేశంలోని అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటున్న పాకిస్థాన్కు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భారత ప్రభుత్వం చేస్తున్న ఈ దాడికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని, రాజకీయాలకతీతంగా ప్రజలు సంఘటితంగా… సైనికుల్ల పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులకు మద్దతు ఇవ్వాలని, దేశానికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూరులో భారత్ విజయం సాధించడం ఖాయమని, ఈ ధర్మ పోరాటానికి దేవుడు అండగా ఉండాలని కోరుకుంటూ పూజలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మాధవరం రంగారావు, తూము శ్రావణ్ కుమార్, పగడాల బాబురావు, ఆలయ కమిటీ చైర్మన్ తులసిరావు తదితరులు ఉన్నారు.
Admin
Studio18 News