Thursday, 15 May 2025 02:24:23 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

వైభవంగా శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం..

కేపీహెచ్‌బీ కాలనీ (KPHB) 6వ ఫేజ్‌లోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. శుక్రవారం అమ్మవారికి ఏకాదశ దుర్గ సూక్త

Date : 09 May 2025 04:15 PM Views : 18

Studio18 News - TELANGANA / HYDERABAD : కేపీహెచ్‌బీ కాలనీ, మే 9: కేపీహెచ్‌బీ కాలనీ (KPHB) 6వ ఫేజ్‌లోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. శుక్రవారం అమ్మవారికి ఏకాదశ దుర్గ సూక్త అభిషేకం, పాలంకరణ సామూహిక శ్రీ చక్ర పూజ బాలముల మంత్ర హోమం పూర్ణాహుతి పూజలు చేశారు. అలాగే శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగింపు చేసి పవలింపు సేవ పూజలు చేశారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కేపీహెచ్‌బీ కాలనీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాస రావు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీఉమా రామలింగేశ్వర స్వామి కృపతో.. పాకిస్థాన్‌పై యుద్ధంలో భారతదేశం విజయం సాధించాలని కోరుకుంటూ పూజలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు, తూము శ్రవణ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. అంతకుముందు కూకట్‌పల్లి రామాలయంలో ఎమ్మెల్యే కృష్ణారావు ప్రత్యేక పూజలు చేశారు. పాకిస్థాన్‌పై భారత్‌ చేస్తున్న ఈ ధర్మ యుద్ధంలో గెలవాలని, ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదాన్ని పోషిస్తూ భారతదేశంలోని అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటున్న పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భారత ప్రభుత్వం చేస్తున్న ఈ దాడికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని, రాజకీయాలకతీతంగా ప్రజలు సంఘటితంగా… సైనికుల్ల పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులకు మద్దతు ఇవ్వాలని, దేశానికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూరులో భారత్ విజయం సాధించడం ఖాయమని, ఈ ధర్మ పోరాటానికి దేవుడు అండగా ఉండాలని కోరుకుంటూ పూజలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మాధవరం రంగారావు, తూము శ్రావణ్ కుమార్, పగడాల బాబురావు, ఆలయ కమిటీ చైర్మన్ తులసిరావు తదితరులు ఉన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :